కల్వకుంట్ల కవిత అరెస్ట్
Publish Date:Mar 3, 2026
Advertisement
మూసీ నదిని ఆక్రమించి భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మాణం వద్ద ఉధృత వాతావరణం నెలకొంది..నార్సింగిలో మూసీ నదిని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్దకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కవిత బైఠాయించారు. దీంతో పోలీసులు కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పేదల ఇండ్లు కూల్చేసే అధికారులు, అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ వెంచర్ మీకు కనిపించడం లేదా?” అంటూ జాగృతి నాయ కులు, కార్యకర్తలు, స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-arrested-36-214948.html





