విలాసాలకు అలవాటుపడి...చైన్ స్నాచర్‌గా మారిన టెకీ

Publish Date:Mar 3, 2026

Advertisement

 

 సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉంటూ విలాసాలకు అలవాటు పడి, దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న ఒక మోస్ట్ వాంటెడ్ ‘హాబిచ్యువల్ అఫెండర్’ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి, మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన నిందితుడు మదనపల్లి మండలం, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కోరకూటి రాజేష్ (35). వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రాజేష్, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు.

*మూడు ప్రధాన నేరాల్లో 

నిందితుడు రాజేష్ ప్రధానంగా మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది..
ఫిబ్రవరి 16న మదనపల్లి బీసెంట్ రోడ్డులోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధి సందులో ఒక ముసలి ఆమె వద్ద నుండి 30 గ్రాముల 


*బంగారు గొలుసును లాక్కెళ్ళాడు (చైన్ స్నాచింగ్)
 
ఇదే ఏడాది ఫిబ్రవరి 6న మళ్ళీ దేవాలయం వీధిలోనే మరో వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించాడని పోలీసులు వెల్లడించారు. నిందితున్ని జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు మదనపల్లి అడిషనల్ ఎస్పీ  ఎం. వెంకటాద్రి  పర్యవేక్షణలో, మదనపల్లి 1 టౌన్ సిఐ కె. రాజా రెడ్డి, సి.సి.ఎస్ ఇన్ స్పెక్టర్ ఎం. చంద్రశేఖర్, ఎస్.ఐ ఎస్.కె రహమతుల్లా, సి.సి.ఎస్ ఎస్.ఐ ఎం.కె నరసింహులు వారి  బృందం మార్చి 3న ఉదయం 8:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులకు సంబంధించిన మొత్తం రికవరీని పూర్తి చేశారు.

జిల్లా ఎస్పీహెచ్చరిక

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, "యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతుంది. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలి తప్ప, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.


 

By
en-us Political News

  
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు.
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది.
క్యారియర్ ఎండీ సుందర్ నారాయణన్‌తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఫలితంగా వరుసగా రెండు భారీ పట్టివేతలు చోటుచేసుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి .సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు
ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.
విమాన ఫ్యూయల్ ధరలు విపరీతంగా పెరగడంతో భారత విమానయాన సంస్థలు నిర్వహణా భారంతో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి.
సీఎం చంద్రబాబు విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది.
ఇండోనేషియా రాజధాని జాకర్తా శివార్లలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.