Publish Date:May 29, 2025
కడప జిల్లా… ఎలాంటి డౌటూ లేదు.. ఈ జిల్లా జగన్ కు కంచుకోటే. అయితే ఆ కోటకు బీటలు వారాయన్నదీ అంతే నిజం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏడింటిలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అయినంత మాత్రాన కడపలో వైసీపీ గాలిపోయిందన్న నిర్దారణకు రావడం సరి కాదు. వైఎస్ హయాం నుంచీ కూడా ఆ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట లాంటిది. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాలను ఎలా అయితే దూరం చేసుకున్నాడో.. అలాగే కడపనూ దూరం చేసుకునే పరిస్థితికి వచ్చారు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా జిల్లాలో తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సహా మూడు నియోజకవర్గాలలో పట్టు నిలుపుకోగలిగారు. అటువంటి కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది. అలా నిర్వహించి ఊరుకోలేదు. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపించింది. వాటిల్లో అతి ముఖ్యమైనది కడప స్టీల్ ఫ్యాక్టరీ. పది రోజుల్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు మహానాడు వేదికగాప్రకటించారు. ఇది కడప జిల్లా ప్రజల మూడ్ ను ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చేస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం నోటి మాటగా చంద్రబాబు కడప స్టీల్స్ గురించి చెప్పి ఊరుకోలేదు. కడప స్టీల్ ఎన్నాటు చేస్తున్న సంస్థకు ఈ మేరకు డెడ్ లైన్ కూడా విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తి కానున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12కు ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కార్ అధికారపగ్గాలు అందుకుని ఏడాది అవుతుంది. కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవం లోగా కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాల్సిదేనని సంబంధిత కంపెనీకి చంద్రబాబు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ తొలి దశలో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో కడప అభివృద్ధి దిశగా పరుగులు పెట్టడం ఖాయమనడంలో సందేహం లేదు. కడప స్టీల్స్ విషయంలో ఐదేళ్ల పాటు ఏం చేయకుండా వైసీపీ చేతులు ముడుచుకుని కూర్చుంది. ఇప్పుడు చంద్రబాబు కూటమి కడప స్టీల్ ప్లాంట్ పనులు పది రోజుల్లో ప్రారంభమౌతాయని ప్రకటించడంతో జిల్లాలో ఇక జనగ్ ను కానీ, జగన్ పార్టీని కానీ పట్టించుకునే నాథుడు ఉండకపోవచ్చని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-steel-works-start-in-10-days-25-198926.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు