కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవేలో కదలిక

Publish Date:Oct 14, 2025

Advertisement

 

నాలుగేళ్లుగా నిలిచిపోయిన కడప రేణిగుంట  గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ మళ్లీ కదలికలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వ చొరవతో కేంద్ర వైల్డ్‌లైఫ్ బోర్డు అనుమతులు లభించడంతో రూ.3,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌కు ఫోర్‌లేన్ హైవే విస్తరణ పనులు ఇప్పుడు మళ్లీ ఊపందుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ చొరవతో ఈ కీలక ప్రాజెక్ట్‌కు కేంద్ర వన్యమృగ సంరక్షణ బోర్డు  ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది.


రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్‌లో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు దశల్లో పనులు కడప నుండి భాకరాపేట, ఒంటిమిట్ట, పెదపల్లె, నందలూరు, రాజంపేట, ఓరంపాడు వరకు మొదలు కానున్నాయి.మొదటి దశలో పనులు కొనసాగనున్నాయి. రెండో దశలో పుల్లంపేట, అయ్యపురెడ్డిపల్లి, బాలాయపల్లి, మామండూరు, రేణిగుంట వరకు విస్తరణ జరుగనుంది.

 *అభయారణ్యాల అనుమతులు సవాలు

ఈ ప్రాజెక్ట్‌లో శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యాల పరిధిలోని మొత్తం 133 హెక్టార్ల భూములను వినియోగించాల్సి రావడంతో అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం నిరంతర చర్చలతో సమస్యను పరిష్కరించి, చివరికి బోర్డు నుండి 20 షరతులతో కూడిన ఆమోదం పొందింది.

*వన్యప్రాణులకు సురక్షిత మార్గాలు

అటవీ  ప్రాంతాల గుండా సాగే రహదారుల వద్ద వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు ఎత్తైన అండర్‌పాస్‌లు నిర్మించాలని బోర్డు ఆదేశించింది. అలాగే వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. గత నాలుగేళ్లుగా కదలని ఈ ప్రాజెక్ట్‌ను కదిలించడంలో కూటమి ప్రభుత్వ పాత్ర కీలకమైంది. 

కేంద్రంతో జరిగిన పునరావృత చర్చలు, సాంకేతిక బృందాల పరిశీలనల ఫలితంగా చివరికి ఈ ప్రాజెక్ట్‌కు ప్రాణం పోసినట్లు అయింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో మరో రెండు నెలల్లోనే ఫోర్‌లేన్ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి కడప–రేణిగుంట హైవే నాలుగు లేన్లుగా రూపుదిద్దుకోనుంది.

*అధికారుల పరిశీలన

 కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు, కూటమి ప్రతినిధులు రెండు రోజుల క్రితం పరిశీలించారు. సిద్దవటం మండలంలోని గ్రామ శివారులోని జేఎంజే కాలేజ్ సమీపం నుండి కనుములోపల్లి, భాకరాపేట, మిట్టపల్లి, మాధవరం గ్రామాల అటవీ ప్రాంతాల వరకు అధికారులు, నాయకులు పరిశీలనలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి (వాసు)  హైవే అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.  రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తక్షణమే తెలియజేయాలని  తెలిపారు.
 

By
en-us Political News

  
నాగోల్‌లో ఉన్న జగ్జీవన్‌రామ్ ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు రెండ్రోజుల వార్షిక సదస్సు అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక్కసారిగా ఎబోలా వైరస్ భయాలు కలకలం రేపాయి.
ఈ ఆపరేషన్‌లో మొత్తం 100 కిలోలకు పైగా స్వచ్ఛమైన కొకైన్‌ను స్వాధీనం చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిషేధిత మాదకద్రవ్యాలు విదేశాల నుంచి సముద్ర మార్గంలో దేశ రాజధాని ఢిల్లీకి తరలించేందుకు స్మగ్లర్లు వ్యూహం పన్నినట్లు అధికారులు గుర్తించారు.
ఆయన చేసిన ప్రసంగాల వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, సభలలో చేసిన వ్యాఖ్యల రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత సెక్షన్ల కింద మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉదయం లేచి రైతులు వచ్చి చూసేసరికి ధాన్యం మొత్తం నీటి పాలైంది. అది చూసిన రైతులు కంటతడి పెట్టుకున్నారు.
చిరంజీవి తీవ్ర అనా రోగ్యంతో ఉన్నారని,ఆయన ఆరోగ్యం విషమించిందని తప్పుడు సమాచారంతో వీడియోలు ప్రచారం చేయ డంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
చిన్న వివాదం కాస్తా పెద్ద గొడవగా మారడంతో జెప్టో డెలివరీ బాయ్స్ గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడుతూ రచ్చ రచ్చ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ అడ్వకేట్‌గా పేరుగాంచిన మొయిజుద్దీన్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ వివాదాలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు సంబంధించిన కేసుల్లో ఆయన చురుకుగా వ్యవహరించడంతో కొందరు ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై స్పష్టత లేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా, పంట పొలాల్లో ఎవరైనా తుక్కు కాల్చడం వల్ల మంటలు వ్యాపించాయా అన్నది తెలియాల్సి ఉంది.
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.