Publish Date:May 18, 2022
ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పట్ల రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తమౌతున్నది. రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక సమీకరణాలతో సంబంధం లేకుండా కేవలం అధినేత ఇష్టాయిష్టాలు, వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు అనిపిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారు. ఉన్న నాలుగు స్థానాలలో ఇద్దరు వేరే పార్టీ నుంచి జంప్ జిలానీ పద్ధతిలో వచ్చిన వారైతే మిగిలిన ఇద్దరూ తనతో పాటు ఆర్థిక నేరాలలో సహ నిందితులు కావడాన్ని ఎత్తి చూపుతున్నారు.
అలాగే వైసీపీ ప్రకటించిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరు బీసీలు కాగా మిగిలిన ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. అలాగే ప్రకటించిన ఇద్దరు బీసీ అభ్యర్థులూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే. వారిద్దరిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం వెనుక కూడా క్విడ్ ప్రోకో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు కేసీఆర్ ఒక ఫార్మా కంపెనీ అధినేతను రాజ్యసభకు పంపనున్నారనీ, ఆ ఫార్మా కంపెనీ అధినేత వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి వియ్యంకుడు కావడంతో అందుకు ప్రతిగా తెలంగాణ సీఎం సిఫారసు చేసిన ఆర్. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపేందుకు జగన్ నిర్ణయించారని చెబుతున్నారు.
ఇక బీసీ కోటాలో రాజ్యసభకు జగన్ ఎంపిక చేసిన మరో వ్యక్తి బీద మస్తాన్ రావు. ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన వలస పక్షి. బీద మస్తాన్ రావుది నెల్లూరు జిల్లా కావలి. ఈయన కావలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఇక మిగిలిన రెండు స్థానాలలో ఒకటి సిట్టింగ్ ఎంపీ విజయసాయిరెడ్డికే ఇచ్చారు.
ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 అన్న సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానం జగన్ అక్రమాస్తుల కేసులు వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇచ్చారు. ఇలా వైసీపీ నాలుగు రాజ్యసభ స్థానాలూ కూడా జగన్ వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఎంపికేనని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. క్విడ్ ప్రోకొ కింద తెలంగాణకు చెందిన ఆర్.లక్ష్మయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కూడా బీసీ ఉద్ధరణ కోసమే అని చెప్పుకోవడం జగన్ కే చెల్లిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-selection-of-candidates-for-rajyasabha-surprises-po0litical-analysts-25-136046.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.