జగన్ బంధువు అరెస్ట్.. పులివెందులలో కదులుతున్న జగన్ పునాదులు

Publish Date:May 9, 2022

Advertisement

వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట. అక్కడి నుంచే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా వెంటనే వైఎస్ కుటుంబానికి తెలిసిపోతుంది. అందుకే తమకు ఎదురునిలిచే నాయకుడు లేడని వైఎస్ కుటుంబం ఇంత కాలం భావించేది. వైసీపీ నేతలు కూడా పులివెందుల తమ నాయకుడికి కంచుకోట అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి చోట వైఎస్ కుటుంబ పునాదులు మెల్ల మెల్లగా కదులుతున్నాయి. ప్రజల్లో మెల్ల మెల్లగా మార్పు మొదలుకావడంతో వైసీపీ నేతల ఆగడాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సమీప బంధువును పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇది రూఢీ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. 

పులివెందులలో ఏం చేసినా తమను అడిగే వారు లేరని వైఎస్ కుటుంబ సభ్యులు భావిస్తారు. అందుకే ఇంత కాలంగా వారి ఆగడాలకు అంతూ పొంతు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబం నుంచి వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయన్నది స్థానికుల ఆరోపణ. ఇప్పుడు అలాంటి వ్యవహారంలోనే జగన్ సమీప బంధువు చక్రాయిపేట మండల వైసీపీ ఇంచార్జి కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల - రాయచోటి వెళ్లే రహదారి పనులు చేస్తున్న ఎస్ ఆర్ కే కన్ స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ ను కమీషన్ కోసం బెదిరించాడని కొండారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. దానితో పోలీసులు కొండారెడ్డిని అరెస్టు చేశారు. ఏకంగా జగన్ కు సమీప బంధువునే పోలీసులు అరెస్ట్ చేయడంతో నియోజకవర్గంలో కొత్త చర్చ మొదలైంది. అధికార పార్టీ నేత, అందులోనూ జగన్ బంధువునే పోలీసులు కటకటాల్లోకి నెట్టడంతో వైసీపీ నేతలు కూడా పులివెందులలో వైఎస్ కుటుంబ హవాకు బ్రేక్ పడుతోందా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. 

నిజానికి జగన్ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత నుంచి జగన్ కు, ఆయన కుటుంబీకులకు పులివెందులపై పట్టు సడలడం ప్రారంబమైందనే చెప్పాలి. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో దీనికి బీజం పడందని చెప్పవచ్చు.    వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తరననంతర సంఘటనల్లో పులివెందుల ప్రజలలో వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు.   సొంత బాబాయ్ మర్డర్ కేసు విషయంలోనూ జగన్ ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడం, పైపెచ్చు హత్య ఆరోపణలు ఎదుర్కొటున్న వారిని వెనకేసుకు రావడం, అలాగే సోదరి, తల్లి పట్ల సీఎం అయిన తరువాత జగన్ చూపుతున్న నరాదరణ పులివెందుల ప్రజలలో జగన్ తీరు పట్ల అయిష్టత పెరగడానికి కారణమయ్యాయంటున్నారు.   మరోవైపు జగన్ సమీప బంధువులే ప్రజలు, కాంట్రాక్టర్లు, అధికారులను వేధిస్తున్నారనే అపవాదు కూడా ఉంది.  ఆ కారణంగానే పులివెందులలో జగన్ పునాదులు కదులుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది.
ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.
భారతంలో ద్రౌపదిని వివస్త్రను చేయడానికి కౌరవులు ప్రయత్నిస్తే.. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మిగల్చడానికి ఆ పార్టీ ప్రయత్నించింది. అందుకే కురుక్షేత్రంలో కౌరవులు ఓడిపోయినట్టుగా.. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.