ఓదార్చింది చాల్లేవయ్యా మగడా!

Publish Date:Dec 1, 2013

Advertisement

 

 

 

జగన్ మరోసారి ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. వైఎస్సార్ చనిపోయి నాలుగేళ్ళు దాటిపోయింది. ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక నిజంగా గుండె ఆగి చనిపోయిన వాళ్ళు ఎంతమంది వున్నారోగానీ, జగన్ ఎంత ఓదార్చినా వాళ్ళ సంఖ్య మాత్రం తరగడం లేదు. ఒకవేళ నిజంగా వైఎస్ మరణం వల్ల బాధతో గుండె ఆగి చనిపోయినవాళ్ళ కుటుంబాలు ఈ నాలుగేళ్ళుగా జగన్ వస్తాడు.. మమ్మల్ని ఓదారుస్తాడని ఎదురుచూస్తూ వుంటాయా? సరే ఇదెలా వున్నా, జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రల విషయంలో ఓదార్చింది చాల్లేవయ్యా మగడా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఈ గుసగుసలు వినిపిస్తోంది ఎవరో బయటి వాళ్ళు కాదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఇలా గుసగుసలాడుకుంటున్నారు. నాలుగేళ్ళ నుంచి  జగన్ పాడుతున్న ఓదార్పు పాట విని వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఉద్యమాలు చేయడానికి, జనాల్లోకి వెళ్ళడానికి బోలెడన్ని సమస్యలు, ఇష్యూలు వుండగా జగన్ ఈ ‘ఓదార్పు’నే పట్టుకుని వేలాడుతూ వుండటం చూసి నాయకులు, కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. జగన్ ఇలా వ్యవహరిస్తూ వుండటం వల్ల పార్టీ నష్టపోతోందని బాధపడుతున్నారు. ఇలా బాధపడుతున్నవాళ్ళని ఓదార్చేవాళ్ళే లేకపోవడం బాధాకరం. బయట అందర్నీ ఓదార్చే జగన్ కూడా వాళ్ళని ఓదార్చడం లేదు.



కొంతమంది నాయకులు ఇక ఓదార్పు యాత్రని ఆపేద్దాం బాబూ అని జగన్‌కి చెబితే జగన్ వాళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూశాడని తెలిసింది. ఓదార్పు యాత్ర  ద్వారా తనకు ప్రజల్లో ఫాలోయింగ్ పెరిగిపోతోందని, ఇకముందు ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వద్దని సదరు నాయకులను జగన్ హెచ్చరించాడని తెలిసింది. ఈ విషయంలో ఇంకోసారి నోరెత్తితే పార్టీలోంచి బయటకి పంపిచేస్తాడన్న భయంతో అందరూ కిక్కురుమనకుండా ఉన్నారు. ఎలాగూ జగన్ తన విధానం మార్చుకోడు. రాబోయే ఎన్నికలలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోతుంది. అప్పుడు వైఎస్సార్సీపీ నాయకులందరూ కలసి జగన్‌ని ఓదార్చాల్సి వస్తుంది.

 

By
en-us Political News

  
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం అంటే.. కేటీఆర్ కు కష్టకాలం మొదలయ్యిందనే చెప్పాలంటున్నారు పరిశీలకులు. ఇప్ప‌టికే వ‌రుస ఓట‌ముల‌తో ఉక్కిరిబిక్కిరై ఉన్న కేటీఆర్ ఇప్పుడు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేస్తార‌న్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది.
సుమారు రెండు దశాబ్దాలుగా.. భద్రతా బలగాలకు చిక్కకుండా.. అరణ్యంలో అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నాడు. దాదాపు పట్టుబడ్డాడు అనుకున్న ప్రతిసారీ.. అదృశ్యమయ్యాడు. అలాంటి హిడ్మా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోవడమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.