జగన్ అందుకే బెట్టు చేస్తున్నాడా?

Publish Date:Oct 16, 2015

Advertisement

 

రాజధాని శంఖు స్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా రానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన అందుకు ఒక ఎనిమిది కారణాలు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయన ఆ లేఖలో పేర్కొనని అసలు కారణం మరొకటి ఉండిపోయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

ఆయన ఆరు రోజుల నిరాహార దీక్షని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు ప్రజలందరి దృష్టి అమరావతి శంఖుస్థాపన కోసం మొదలయిన హడావుడిపైనే ఉంది. జగన్ దీక్షని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైకాపా నేతలు పదేపదే ఆరోపించదమలో ఉద్దేశ్యం అదే. వారు పైకి చెప్పలేదు కానీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అమరావతి శంఖు స్థాపనకి ‘మన నీళ్ళు మన మట్టి’ అంటూ హడావుడి చేసిందని భావిస్తున్నట్లున్నారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ శంఖు స్థాపన కార్యక్రమంపై నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని తన వైపు మళ్ళించుకొనేందుకే జగన్మోహన్ రెడ్డి తను దానికి పిలిచినా రానని చెపుతున్నట్లున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను స్వయంగా వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానిస్తానని చెప్పినప్పుడు మీడియా ఆ విషయం గురించి చాలా విశ్లేషించింది. దానితోబాటే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా? అని అప్పుడే అనుమానం వ్యక్తం చేస్తూ అనేక కధనాలు ప్రచురించాయి. ఊహించినట్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమయిన కార్యక్రమానికి హాజరు కాబోనని ప్రకటించేసి మీడియాకి మళ్ళీ చేతి నిండా పని కల్పించారు. ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా దీని గురించే చర్చ జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల దృష్టిని అమరావతి కార్యక్రమం నుంచి తనపైకి మళ్ళించుకొనేందుకే అటువంటి విచిత్రమయిన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఆయన వేసిన ఈ ఐడియా తాత్కాలికంగా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చును. కానీ శాస్వితంగా ఆయన రాజకీయ జీవితంలో ఒక చారిత్రిక తప్పిదంగా మిగిలిపోవడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆయన పట్ల ప్రజలలో మరింత విముఖత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన అధికార తెదేపా నేతలకు జగన్ స్వయంగా బలమయిన అస్త్రం కూడా అందించినట్లయిందని అభిప్రాయపడుతున్నారు. తెదేపా నేతలు తనను ఎంతగా విమర్శిస్తే అంతగా తన పేరు జనంలో మీడియాలో నానుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో కానీ అది ఆయన గురించి నెగెటివ్ పబ్లిసిటీ అవుతుందని దాని వలన తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గ్రహించలేకపోవడం ఆశ్చర్యమే.

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.