అతను ఎవరికీ అంతుపట్టడు...

Publish Date:Aug 11, 2015

Advertisement

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. రాష్ట్ర విభజన జరుగుతుందని తెలియగానే తెలంగాణా నుండి ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయి సమైక్యాంధ్ర పోరాటం మొదలుపెట్టిన ఆపార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలలో రాష్ట్ర విభజనకు కారణమయిన తెరాసకు మద్దతు పలికారు. తెలంగాణా ప్రజల తరపున తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతామన్న వ్యక్తి మళ్ళీ అదే తెరాస ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చారంటే ఏవో కుంటిసాకులు చెప్పారు. నిన్న మొన్న వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడని ఆయన, రాహుల్ గాంధీ వచ్చి విమర్శించేసరికి హడావుడిగా డిల్లీ వెళ్లి ధర్నా చేశారు. అదే మాట కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం అన్నారు కూడా. అంటే బీజేపీతో ఇక దోస్తీ కుదిరే అవకాశాలు లేవని గ్రహించి రాహుల్ గాంధీ మాట విని డిల్లీ వెళ్లి ధర్నా చేసి మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం ద్వారా మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారేమో అని జనాలకి అనుమానం కలిగించారు.

 

కానీ ఏడాదిగా కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనని జగన్మోహన్ రెడ్డి డిల్లీలో చేసిన ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకోనేందుకే తమ అధినేతని విమర్శించారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరరెడ్డి విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకే అతను డిల్లీ వెళ్లి ధర్నాచేసారని తెదేపా నేతలు అనుమానిస్తే, మోడీని ప్రసన్నం చేసుకొనేందుకే సోనియా గాంధీని విమర్శిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తను ప్రత్యేక హోదా కోసమే డిల్లీ వెళ్లి ధర్నా చేశానని చెప్పుకొంటున్నా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు వింటుంటే ఆయన దీక్షకు పరమార్ధం ఏమిటని అనుమానించవలసివస్తోంది. ఈవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరికీ అంతుపట్టని విధంగా వ్యవహరిస్తూ అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అందుకే అతనికి రాజకీయ పరిపక్వత లేదని పీసీసీ అధ్యక్షుడు రఘువీరరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసారేమో?

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.