జగన్ గుంటూరు ర్యాలీ.. అంబటి కోసమా?.. అలజడి కోసమా?

Publish Date:Feb 3, 2026

Advertisement

గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి గెస్ట్ ఆర్టిస్ట్ గా మాత్రమే వచ్చి వెడుతున్నారు. గత ఎన్నికలలో వైసీపీ పరాయం తరువాత నుంచీ ఏపీకి వచ్చి వెడుతున్న జగన్ షెడ్యూల్ ను గమనిస్తే ఆయన  వారంలో మూడు రోజులు మాత్రమే ఏపీకి కేటాయిస్తున్నారు. ఆ మూడు రోజులలోరెండు ఆయన బెంగళూరు నుంచి రాక, పోకకు తీసేస్తే నికరంగా ఆయన రాష్ట్రంలో ఉంటున్నది కేవలం ఒక్క రోజు మాత్రమే. అంటే ఆయన బుధవారం ఏపీలోకి అడుగుపెట్టి.. గురువారం మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు తిరుగు ప్రయాణం అవుతున్నారు. విపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ పరాజయం పాలైన తరువాత ఆయన షెడ్యూల్ దాదాపుగా ఇలాగే ఉంది.  
ఈ సారి కూడా ఆయన బుధవారం ఏపీకి వస్తున్నారు. అయితే ఈ సారి ఆయన రాకకు ఒక ప్రాధాన్యత ఉంది. అదే బూతుపురాణం కారణంగా అంబటి అరెస్టు. ముఖ్యమంత్రిపై  అనుచిత వ్యాఖ్య లు, దుర్భాషల కారణంగా అంబటి అరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు ముందు సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు గుంటూరులోని ఆయన నివాసంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో జగన్ బుధవారం (ఫిబ్రవరి 4) అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ పరామర్శకు కూడా భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. వాస్తవానికి ఆయన పరామర్శించాల్సింది (అసలా అవసరం లేదు. ఎందుకంటే అంబటి అరెస్టైంది ఏదో ప్రజా సమస్యపై ఆందోళన చేసి కాదు. సీఎంపై అసభ్య, సభ్య సమాజం ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడని బూతులతో విరుచుకుపడినందుకు) రాజమహేంద్రవరంలో ఉన్న అంబటి రాంబాబును. కానీ జగన్ మాత్రం గుంటూరు లో ర్యాలీ చేసి అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిం చనున్నారు. 

అసలు అంబటి రాంబాబు అరెస్టై రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి మూడు రోజులు అయ్యింది. ఆయన నివాసంపై దాడి జరిగి నాలుగు రోజులు. నిజంగా అంబటి నివాసంపై దాడి, అంబటి అరెస్టుపై జగన్ నిజంగా ఆగ్రహం చెందారంటే.. దాడి జరిగిన రోజునే బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి ఉండాలి.

కానీ ఆయన షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు. యధావిధిగా ఆయన బుధవారం (ఫిబ్రవరి 4)నే బెంగళూరు ప్యాలెస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. అయితే ఈ సారి తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా మీట్ తో సరిపెట్టకుండా, గుంటూరులో ర్యాలీ చేయనున్నారు. అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.  ఈ సారి ర్యాలీ సందర్భంగా కూడా భారీ జనసమీకరణ, శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం లాంటి వ్యూహాలు వైసీపీయులు చేసే ఉంటారన్న అంచనాతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
పొన్న‌వోలు వాదించ‌డంతో బెయిలుపై బ‌య‌ట‌కు రావ‌ల్సిన అంబ‌టి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లారు. ఇందుకు పొన్న‌వోలు అత్యుత్సామే కారణమంటున్నారు. కారుమూరి వెంక‌ట‌రెడ్డి విష‌యంలో వెంట‌నే బెయిలు ఇప్పించారు. అదే ఇప్పుడు అంబ‌టి కాపు నేత కావ‌డంతో రిమాండ్ పై పంపించార‌న్న కోణంలో కొన్ని వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.