తెలిసి తెలిసీ తప్పుడు ఆరోపణలు.. వైసీపీ నైజం అదేనా?

Publish Date:Feb 18, 2026

Advertisement

జనం సొమ్ముతో మంత్రి జల్సాలు అంటూ   కొలంబోలో భారత్, పాకిస్థాన్  మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించడానికి వెళ్లిన మంత్రి లోకేష్ పై వైసీపీయులు   చేసిన ప్రచారంపై లోకేష్ ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే... నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా.. జగన్ అంటూ తనదైన స్టైల్ లో స్పందించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  కొలంబో మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి లోకేశ్ ప్రభుత్వ ధనంతో వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం స్పష్టత ఇచ్చింది. 

వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.  టీమ్ ఇండియా, పాకిస్థాన్  మధ్య జరిగిన టి20 వరల్డ్  కప్ మ్యాచ్ చూడడానికి కొలంబో వెళ్లిన లోకేష్ అందుకైన ఖర్చు మొత్తం  స్వయంగా భరించారు, రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా  ఇందుకోసం వ్యయం చేయలేదు. అయితే వైసీపీ మాత్రం ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ విమర్శలు గుప్పించింది.  అయితే ఫ్యాక్ట్ చెక్ లో వైసీపీ ప్రచారమంతా అవాస్తవమని విస్పష్టంగా తేలింది. రాష్ట్ర ఖజానా నుంచి లోకేష్ కొలంబో పర్యటనకు ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని తేటతెల్లమైపోయింది. గతంలో కూడా తన సొంత పర్యటనల కోసం ప్రభుత్వం సొమ్ము వినియోగించడం లేదని పలు సందర్భాలలో లోకేష్ చెప్పారు. అయినా వైసీపీ విమర్శలు చేస్తూ ప్రతిష్ఠ దిగజార్చుకుంటోంది.

 మసిగుడ్డ మీదేస్తాం.. మీరే తుడుచుకోండి అన్న చందంగా వైసీపీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో జగన్ అధికారంలో ఉండగా... ఆయన సతీసమేతంగా చేసిన విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును వినియోగించిన సందర్భాలను పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  గతంలో అంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో తన పెద్ద కుమార్తె హర్ష ప్యారిస్ లోని అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్  గ్రాడ్యుయేషన్ (ఎంబీఎ) పూర్తి చేసిన సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ రెడ్డి సతీ సమేతంగా ప్యారిస్ వెళ్లారు.   తన కుమార్తె  పట్టా పుచ్చుకునే వేడుకను చూడాలనుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేదు. అయితే అందుకోసం ఆయన ప్యారిస్ వెళ్లడానికి జనం సొమ్ము ఖర్చు చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతిని పరిశీలకులు చెబుతున్నారు.  

అప్పటి ఆయన పారిస్ పర్యటన నాలుగు రోజులు సాగింది. ఇందు కోసం రానూ పోనూ విమాన ఖర్చులే రూ.10 కోట్లు అని అప్పట్లో గట్టిగా వినిపించింది. అప్పట్లో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఉద్యోగులకు వేతనాలు సమయానికి చెల్లించే పరిస్థితి కూడా లేదు. అలాగే సంక్షేమ పథకాలకే ప్రభుత్వం కోత పెడుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో  ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ సొమ్ము రూ. 10 కోట్లు ఖర్చు చేయడాన్ని జగన్, ఆయనపార్టీ నేతలూ ఎలా సమర్థించుకోగలరని ప్రశ్నిస్తున్నారు. తన హయాంలో జనం సొమ్మును జగన్ పాకెట్ మనీగా వాడుకున్నారని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి. 

By
en-us Political News

  
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
అంబటి రాజమహేంద్రవరం జైలులో ఉంటే జగన్ కనీసం అటుకేసి కూడా చూడటం లేదు. కేవలం గుంటూరుకే పరిమితమై.. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో సరిపెట్టేయనున్నారు.
పొన్న‌వోలు వాదించ‌డంతో బెయిలుపై బ‌య‌ట‌కు రావ‌ల్సిన అంబ‌టి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలుకు వెళ్లారు. ఇందుకు పొన్న‌వోలు అత్యుత్సామే కారణమంటున్నారు. కారుమూరి వెంక‌ట‌రెడ్డి విష‌యంలో వెంట‌నే బెయిలు ఇప్పించారు. అదే ఇప్పుడు అంబ‌టి కాపు నేత కావ‌డంతో రిమాండ్ పై పంపించార‌న్న కోణంలో కొన్ని వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.