పులివెందులలో జగన్ బస్టాండ్ కథ!

Publish Date:Aug 30, 2022

Advertisement

ఇంట గెలిచి.. రచ్చ గెలువు అనేది పెద్దలు చెప్పిన మాట. అంటే ముందు ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాత ఇతర వ్యవహారాలు చేస్తే మంచిదనేది దాని అర్థం. అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా వినియోగించే వ్యంగ్యాస్త్రం ఇది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కే ఆయన మాటలు సరిగ్గా సరిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కొనసా...గుతున్న బస్టాండ్ నిర్మాణం కథ అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

నవరత్నాలంటారు.. సంక్షేమ పథకాలంటారు.. ఆంధ్రుల ప్రజా రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడతారు. అభివృద్ధి అంటారు.. స్కూళ్లలో ఇంగ్లీషు మాధ్యమం అని చెబుతారు.  అక్కచెల్లెమ్మలకు అంత చేస్తా ఇంత చేస్తా అంటూ గొప్పలు చెబుతారు. పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు ఇస్తామంటారు. నోటికి వచ్చిన హామీ ఇచ్చేసి.. ఖజానా ఖాళీ చేసి ఆనక ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఓట్లేసిన ప్రజల్ని వారి మానాన వారిని వదిలేస్తారు.  ఏపీకి తానేదో చేశాననే భ్రమలోనే కబుర్లు చెబుతుంటారు.

ఇంత చెప్పుకుంటున్న జగన్ తనను అఖండ మెజార్టీతో గెలిపిస్తున్న పులివెందుల ప్రజలకు ఏమి చేశారనే ప్రశ్న వస్తే.. మాత్రం జనం నోరెళ్లబెట్టడమే సమాధానంగా ఉంటుంది. అందుకు పులివెందుల బస్టాండ్ ప్రత్యక్ష నిదర్శనం అంటారు. నిజానికి సీఎం సొంత నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఎలా ఉండాలి? మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా కనిపించాలి. పులివెందులలోని బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునే సౌకర్యం మాట దేవుడెరుగు.. కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనట్లు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ‘ఉన్నదీ పోయే.. తెచ్చుకున్నదీ పోయే’ అనే తీరులో పులివెందులలో అన్ని హంగులతో కొత్త బస్టాండ్ కట్టేస్తామంటూ గొప్పగా చెప్పిన జగన్ సర్కార్ ఉన్న పాత బస్టాండ్ ను   కూలగొట్టేసింది. ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినప్పటికీ కొత్త బస్టాండ్ ను నిర్మించలేదంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. పాత బస్టాండ్ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు.. తీవ్రంగా అవస్థలు పడుతుండడంతో తాత్కాలికంగా తాటాకులతో చిన్న పందిరి వేసినా.. అది ఎండ నుంచి కానీ, వర్షం నుంచి కానీ ఏమాత్రం కాపాడలేకపోతోంది. ఏ కొంచెం గాలి వీచినా దాని టాప్ లేచిపోతోంది. దాంతో పాటు పాత భవనం కూలగొట్టిన బస్టాండ్ ఆవరణలో దుమ్ము ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే.. వారి బాధలు వర్ణనాతీతం.  

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందులలో అత్యాధునిక హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ఒక డిజైన్ ను ప్రభుత్వం రెడీ చేసింది. ఆ డిజైన్ ఓ రంగుల కలలా, గ్రాఫిక్స్ మాయాజాలంలా రూపొందించింది. కానీ సీఎం అయి, మూడేళ్లయినా బస్టాండ్ నిర్మాణం అతీగతీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయినా.. సొంత నియోజకవర్గం ప్రజలకు బస్టాండ్ కూడా కట్టించలేని   జగన్ ఇక ఏపీకి రాజధాని నగరాన్ని అదీ ఒకటి కాదు మూడు ఎలా కట్టగలరు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా అమరావతి రాజధాని కోసం సిద్ధం చేసిన డిజైన్ ను ప్రతిపక్ష నేతగా జగన్, వైసీపీ నేతలు కూడా దాన్ని ‘గ్రాఫిక్స్ మాయాజాలం’ అంటూ విమర్శించిన విషయం   తెలిసిందే. అయితే.. ఇప్పుడు పులివెందుల కొత్త బస్టాండ్ విషయంలో జగన్ చేసింది గ్రాఫిక్స్ మాయాజాలం కాక మరేమిటనే ప్రశ్న పలువురి నుంచి వస్తోంది. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ డిజైన్ ను కూడా గ్రాఫిక్స్ మాయాజాలంగానే భావించి, దాని నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ నెటిజన్లు సీఎం జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో పులివెందులలో తాటాకు బస్టాండే ప్రయాణీకులకు గతి అంటూ సోషల్ మీడియా వెక్కిరిస్తోంది.

ఒక పక్కన పులివెందులలో పాత బస్టాండ్ కూలగొట్టి, తాటాకులతో వేసిన బస్టాండ్ ఆవరణను, మరో పక్కన ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించిన శాశ్వత బస్టాండ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియా షేర్ చేస్తూ ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు. అభివృద్ధి అంటే ఏంటో కుప్పం బస్టాండ్ ను చూసి అయినా జగన్ నేర్చుకోవాలని   హితవు పలుకుతున్నారు.   ప్రజా రాజధాని సంగతి దేవుడెరుగు.. సొంత నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మించలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వైఎస్ కుటుంబానికి పెట్టని కోట పులివెందుల అభివృద్ధిని పట్టించుకోని జగన్ ఈ సారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175కు 175 అసెంబ్లీ స్థానాలూ గెలుస్తామని జగన్ చెప్పడంలో అతి అనిపించడం లేదా? అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.