100% సజ్జల టీం!.. కొత్త కేబినెట్‌లో ఆయ‌నదే మార్క్‌!!

Publish Date:Apr 15, 2022

Advertisement

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 కేబినెట్ లోని మంత్రులు ఒక్కొక్కరూ తమకు కేటాయించిన చాంబర్లలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రెండో కేబినెట్ లో స్థానం దక్కించుకున్న తొలి మంత్రివర్గంలోని మంత్రులు సంతోషంగా ఉన్నారు. కేబినెట్ లో కొనసాగింపు లభించని పలువురు తాజా మాజీ మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు బుజ్జగిస్తున్నారు.

అయినా మరీ పట్టు వీడకుండా పంతం పట్టి కూర్చున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని నేరుగా జగన్ రెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ఇక తాజా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా గత కొద్ది రోజులుగా అలక పాన్పు ఎక్కడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ అందజేశారు. కానీ.. ఏమి జరిగిందో ఏమో బుధవారంనాడు ఆమె నేరుగా సీఎం జగన్ తో చర్చలు జరిపారు. జగన్ రెండో కేబినెట్ లో స్థానం కోసం పరితపించిన సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు మీడియా సాక్షిగా భోరున విలపించారు. మరికొందరు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదిలా ఉండగా.. జగన్మోహన్ రెడ్డి రెండో కేబినెట్ కూర్పులో ‘అంతా మీరే చేశారు’ అనే తీరులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు గురించే బాగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గం కూర్పు అంతా సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ రెడ్డి పూర్తిగా సజ్జలపైనే ఎందుకు ఆధారపడాల్సి వచ్చిందనే సందేహాలు కూడా పలువురి నుంచి వస్తున్నాయి. జగన్ రెడ్డి తొలుత తన రెండో కేబినెట్ పూర్తిగా పాతవారిని తొలగించి, కొత్త వారితో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముందుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మొత్తం 11 మంది పాత మంత్రులకు కొత్త కేబినెట్ లో బెర్త్ లు దొరికాయి. అలా మళ్లీ మంత్రి పదవులు లభించిన పాతవారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొనసాగింపు ఇవ్వడం వెనుక ఏదో భయం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక బుగ్గన విషయానికి వస్తే ఆర్థిక మంత్రిగా ఆయనను కొనసాగించడం తప్పనిసరి అని భావించడమే కారణం అంటున్నారు.

అంతకు ముందు అంతా కొత్తవారినే కేబినెట్ తీసుకునే ఛాన్స్ ఉందంటూ మీడియాకు లీకులు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత 11 మంది పాతవారిని కొనసాగించడంలో ప్రముఖ పాత్ర వహించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటు కొత్తవారికి పదవులు లభించిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గురించి. ఆమె మాటకారితనం, పనితనం, సేవాకార్యక్రమాలతో పాటు తనతో కాస్త ఎక్కువ చనువుగా ఉండడం వల్లే రజినికి సజ్జల రామకృష్ణారెడ్డి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ చేయించారనే వార్త ఒకటి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

నిజానికి కేబినెట్ లో ఎవరిని ఉంచాలి? ఎవరెవరినీ కొత్తవారిని తీసుకోవాలి? అనే విషయంలో సీఎం జగన్ కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే.. ఎప్పుడైతే కేబినెట్ కూర్పులో సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం తీసుకోవడం, గంటల తరబడి ఆయన ఒక్కడితోనే సమాలోచనలు చేయడం వెనుక ఏదో ఆంతర్యం ఉండి ఉంటుందనే అనుమానాలు పలువురి మధ్య చర్చకు వస్తున్నాయి. అసలు సీఎం జగన్ ఇంతలా సజ్జల మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం ఎంపికలో జగన్ రెడ్డి అభీష్టం కంటే సజ్జల ఇష్టానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అలాగే మంత్రిత్వశాఖల కేటాయింపు విషయంలో కూడా సజ్జలే ప్రముఖ పాత్ర వహించారంటున్నారు. ఏదో భయంతో బొత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు కొనసాగింపు ఇచ్చినా.. అంతకు ముందరి కంటే ప్రాధాన్యం లేని శాఖలు కట్టబెట్టారనే అసంతృప్తి కూడా వారిలో ఉందంటున్నారు.

కేబినెట్ బెర్త్ కొనసాగింపు లేక అలక వహించిన పాత మంత్రుల్ని బుజ్జగించడంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నడుంకట్టుకుని రంగంలోకి దిగడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో అయితే పలుమార్లు సజ్జల రామకృష్ణారెడ్డే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించే ప్రయత్నం చేయడం విశేషం. కేబినెట్ కూర్పులో తన మార్కు ఉన్నందువల్లే సజ్జల ఇలా ప్రతి విషయానికీ తెరమీదకు వస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద ఏపీ కొత్త కేబినెట్ కూర్పు చూస్తే.. ‘అది సజ్జల టీం’ అనే సందేహం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.