జగన్ తో సాయి రెడ్డి కటీఫ్! బీజేపీ డైరెక్షన్ లో వెన్నుపోటు? 

Publish Date:May 31, 2021

Advertisement

విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్ తర్వాత నెంబర్ టు స్థానం విజయసాయి రెడ్డిదేనని ప్రచారం ఉంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సీఎంవోలోనూ సాయి రెడ్డిదే హవా అని చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏ1గా జగన్ ఉండగా.. ఏ2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేసుల్లో జగన్ తో పాటు సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపారు సాయిరెడ్డి. అందుకే ఆయనకంత ప్రాధాన్యం అంటారు. అయితే  ప్రస్తుతం మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, సీఎంవో నుంచి వస్తున్న లీకుల ఆధారంగా విజయసాయి రెడ్డిని సీఎం జగన్ దూరం పెట్టారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాకపోవడం, ముఖ్యమంత్రిని కలవకపోవడం ఇందుకు బలాన్నిస్తున్నాయి. సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఎక్కడా సాయి రెడ్డి  కనిపించ లేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే విజయసాయి రెడ్డి... ముఖ్యమైన ప్రోగ్రామ్ లో సైలెంట్ గా ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయి రెడ్డిని తన దగ్గరకు రానివ్వడం లేదని తెలుస్తోంది. అందుకే అతను విశాఖకే పరిమితం అయ్యారని అంటున్నారు. విశాఖకు సంబధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారమే తప్ప ఇతరత్రా గతంలోగా విజయసాయికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు. గతంలో విశాఖలో ఏం జరిగినా అంతా సాయిరెడ్డి చెప్పినట్లే ఉండేది. కాని ఇప్పుడా సీన్ కనిపించడం లేదు. ఇటీవలే తూర్పు తీరంలో యాస్ తుఫాన్ వచ్చింది. ఏపీపైనా ప్రభావం పడింది. అయితే తుపానుపై జరిగిన సమీక్షల్లో విజయసాయి ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు సీఎస్ ఆధిత్యనాథ్ ను విశాఖ పంపించారు సీఎం జగన్. సీఎస్సే రెండు రోజుల పాటు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విజయసాయి రెడ్డి విశాఖలోనే ఉన్నా..  తుపాను సమయంలో ముఖ్యమంత్రి అతన్ని పట్టించుకోకపోవడం చర్చగా మారింది.  

గత సంవత్సరం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన సమయంలోనూ ఎంపీ విజయసాయిని పక్కన పెట్టారు సీఎం జగన్. విజయవాడ నుంచి జగన్ తో పాటు ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ వచ్చేందుకు విజయసాయి ప్రయత్నించారు. అయితే విజయసాయిని కిందకు దించి వైద్య శాఖ మంత్రి అళ్లనానిని తనతో పాటు తీసుకెళ్లారు జగన్. ఈ ఘటన అప్పడు సంచలనంగా మారింది. విజయసాయిని ఆగమని జగన్ చెబుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అప్పటి నుంచే సాయి రెడ్డిని జగన్ క్రమంగా దూరం పెడుతున్నారని, ఇప్పుడా గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని తెలుస్తోంది. జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి తాడేపల్లి రావడం లేదని అంటున్నారు. సాయి రెడ్డికి షాకిచ్చిన జగన్.. అతనికి గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

జగన్ రెడ్డి , విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్న సమయంలోనే మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. జగన్​మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్​షీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి. తాజా కేసుకు సంబంధించి ఈడీ  గత ఏడాదిలోనే ఛార్జ్​షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నమోదైన 18వ కేసులో జగన్‌ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అనూహ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ తో విజయసాయి రెడ్డి సంబంధాలు పెంచుకోవడం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికి కారణమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. 

తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్ అక్రమాస్తుల కేసులో ఏదైనా జరగవచ్చని, జగన్ పై కోపంతో విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారినా ఆశ్చర్యం లేదనే టాక్ కూడా నడుస్తోంది. బీజేపీ పెద్దలతో కలిసి విజయసాయి రెడ్డి.. జగన్ పై  కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన కూడా  కొందరు వైసీపీ నేతల్లో ఉందంటున్నారు. అందులో భాగంగానే  గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన కేసులో సాయి రెడ్డి పేరు తొలగించారనే వాదనలు వస్తున్నాయి. ఇక బెయిల్ రద్దై జగన్ జెైలుకు పోతే ముఖ్యమంత్రి కావాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. ఈ సమయంలో  మంత్రి పెద్దిరెడ్డికి  విజయసాయి రెడ్డి తోడైతే ఏపీలో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, సీఎం జగన్ కేసుల్లో ఏదైనా జరగవచ్చనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

By
en-us Political News

  
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.