ఢిల్లీ హత్యాచార నిందితుడు మామూలోడు కాదు.. విస్తుపోయే విషయాలు!

Publish Date:Apr 23, 2026

Advertisement

 

ఢిల్లీలో సీనియర్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి, వారి నివాసంలోనే హత్య చేసిన నిందితుడు రాహుల్ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు . దేశ రాజధాని అమర్ కాలనీలో బుధవారం ఉదయం గతంలో వారి ఇంట్లో పనిచేసిన యువకుడే అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేశాడు. ఐఆర్ఎస్ అధికారి, ఆయన భార్య ఉదయం జిమ్‌కు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వారి కుమార్తె ఒక్కరే ఇంట్లో ఉండగా.. టెర్రస్‌పై ఉండే ఆమె గదిలోకి నిందితుడు చొరబడి ఘాతుకానికి పాల్పడ్డాడు. 

దీనికి కొద్ది గంటల ముందు మరో మహిళపై అత్యాచారం చేశాడని విచారణలో వెల్లడైంది. నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్‌లో తన స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి.. ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించినట్టు బయటపడింది. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అల్వార్‌ జాతీయ రహదారిపై అంబులెన్స్ ఎక్కిన నిందితుడు.. డ్రైవర్‌కు రూ.5,000-రూ.6,000 ఇస్తానని అన్నాడు. కానీ, ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ డబ్బు ఇవ్వకుండా పారిపోయాడు. స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి, ఆమెను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన కొన్ని గంటల తర్వాతే అతను ఈ ప్రయాణం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. 

ఈ ఘటనపై కేసు నమోదుచేసి.. రాజస్థాన్, ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి నిందితుడు తన ఇంట్లోకి బలవంతంగా చొరబడి, లైంగిక దాడి చేసి, కరిచి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడని అల్వార్ బాధితురాలు ఆరోపించింది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తన భర్త, పిల్లలను చంపేస్తానని కూడా రాహుల్ బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి భర్త బంధువుల వివాహం కోసం సొంతూరుకు వెళ్లగా.. ఇద్దరు పిల్లలతో ఆమె అల్వార్‌లోనే ఉందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. 

ఈ ఘటన జరిగిన వెంటనే తమకు ఫిర్యాదు అందిందని, వెంటనే కేసు నమోదు చేశామని అల్వార్ పోలీసులు తెలిపారు.  అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్న తర్వాత నిందితుడు తాను గతంలో పనిచేసిన దక్షిణ ఢిల్లీలోని ఐఆర్ఎస్ అధికారి నివాసానికి వెళ్లాడు. గతంలో అక్కడ పనిచేసి ఉండటంతో ఆ ఇంటి గురించి అతడికి బాగా తెలుసని దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుడు హత్యాచారం తర్వాత ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో సుమారు రూ. 2.5 లక్షలు దొంగిలించినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
భర్త హత్యకు ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన భార్య ఘటన వైయస్సార్ కడప జిల్లాలో సంచలనం రేపింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, తద్వారా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
టెక్ రంగానికి ప్రాణాధారమైన హెచ్-1బీ వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాదిలో వీసాల జారీ 25 శాతం తగ్గడమే కాకుండా.. పిటిషన్లపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడం వల్ల కంపెనీల దరఖాస్తులు ఏకంగా 87 శాతం పడిపోయాయి. దీనివల్ల ప్రతిభామంతులైన భారతీయ యువతకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు దక్కడం గగనంగా మారుతోంది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.