కోల్ కత్తాకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్

Publish Date:Apr 11, 2013

Advertisement

 

ఐ.పి.ఎల్.-6 లో క్రిస్ గేల్ మరోసారి విజృంభించడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. క్రిస్ గేల్ వీరవిహారంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 155 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు ఛేదించింది. మొదట టాస్ గెలిచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కత్తా ఓపెనర్ బిస్లా (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరుకున్నాడు. మరో ఓపెనర్ కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కు జాక్విస్ కల్లీస్ జత కలిశాడు. వీరిద్దరూ ఇన్నింగ్స్ ను సరిదిద్దే క్రమంలో జట్టుస్కోరు 54 వద్ద ఉండగా వినయ్ కుమార్ బౌలింగ్ లో కల్లీస్ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. గౌతమ్ గంభీర్ 46 బంతుల్లో 59 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 27, డివిలియర్స్ 23, మనోజ్ తివారీ 23 ఇన్నింగ్స్ రన్ రేట్ పెంచేక్రమంలో ధాటిగా ఆడి పెవిలియన్ చేరుకున్నారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ మిగతా బ్యాట్స్ మెన్ స్కోర్లు మోర్గాన్ 2, భాటియా 13, మెక్ లారెన్ 2, సంగ్వాన్ 4 నాటౌట్, నరైన్ 1 నాటౌట్. నిర్ణీత ఇరవై ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగుల వద్ద తెరపడింది. తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ అగర్వాల్ (6) వికెట్ ను జారవిడుచుకున్నా మరొక ఓపెనర్ క్రిస్ గేల్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ తోడవడంతో ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ జెట్ స్పీడ్ లో పరుగులు రాబట్టింది. క్రిస్ గేల్ ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోయాడు. క్రిస్ గేల్ రికార్డ్ స్థాయిలో తొమ్మిది సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్ 50 బంతుల్లో 85 నాటౌట్, ఇందులో 4 బౌండరీలు కాగా 9 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లీ 35 పరుగులు, డీవిలియర్స్ 22 నాటౌట్ గా నిలిచారు. కోల్ కత్తా నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించిన క్రిస్ గేల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

By
en-us Political News

  
రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత నియామక పత్రాలను పంపిణీ చేశారు.
ఐ బొమ్మ రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
గీత యూనివర్సిటీ పై 118 కోట్ల కరెంటు బకాయిలు ఉండడాన్ని చూసి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు
సిడ్నీలో కాల్పులు జరిపిన నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందిన వాడేనని తెలంగాణ డీజీపీ ఆఫీసు తెలిపింది.
అమెరికాలో భారతీయులు.. అందులోనా తెలుగు వారు గొప్ప ఖ్యాతి గడిస్తున్నారు.
రుషి కొండ ప్యాలెస్ కోసం టాటాతో పాటు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికాడు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంపై దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చాంది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్ష‌త‌న తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం నిర్వహించారు.
నిందితుడైన సాజిత్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.సాజిత్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్‌పోర్ట్ పొందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతే కాకుండా, అతడు హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్, పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి.
మోనాలిసా అనే మహిళ తన ఏడేళ్ల కుమార్తె షారోని మేరిని ఒక్కసారిగా బిల్డింగ్ మూడో అంతస్తు పైనుంచి కిందకు తోసివేసింది‌. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా చిన్నారి రక్తమడుగులో పడి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.