ఇటు చిరంజీవి అటు ఆళ్ల మ‌ధ్య‌లో జ‌గ‌న్‌!

Publish Date:Aug 30, 2022

Advertisement

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా నేనే పోటీచేస్తాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్న పెద్దోడిని  కాద‌ని  బుజ్జ‌గించి ప‌క్కంటి వాళ్ల‌బ్బాయిని ఒకే అనిపించారు. సాయంత్రానికల్లా పోటీలో ఫ‌లానావారి అబ్బాయిపోటీ చేస్తు న్నాడ‌ని తెలుసుకుని పెద్దోడు ప‌ట్టుప‌ట్టాడు. ఈ ఇంటాయ‌న త‌ల‌ప‌ట్టుకున్నాడు. ఒక‌డు మొండికేసాడు, రెండోవాడిని తెచ్చిపెట్టుకుని  ఆశ‌లు క‌ల్పించిన పెద్దాయన  భ‌గ‌వాన్  ఈ  దుస్థితి పగవాడికి కూడా  రాకూడ‌ద‌నుకున్నాడు.

చిత్ర‌మేమంటే స‌రిగ్గా ఇలాంటి సీన్  ఇపుడు వైసీపీలో ఈస్ట్ మన్ కలర్ లో కనిపిస్తోంది. మంగ‌ళ‌గిరి ఎన్నికల విష‌యంలో వైసీపీ పెద్ద స‌మ‌స్య‌నే ఎదుర్కొంటోంది. మంగ‌ళ‌గిరిలో తెలుగు దేశం నుంచి నారా లోకేష్ పోటీచేయడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయ‌నను దీటుగా  ఢీకొని గెలిచే అభ్యర్థిని రంగంలోనికి దించాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. అనేక వ్యూహాలు, చ‌ద‌రంగ‌పుటెత్తుల త‌ర్వాత గాలం వేసి మరీ గంజి చిరంజీవిని తెలుగుదేవం పార్టీ నుంచి వైసీపీలోకి   లాక్కున్నారు. చిరంజీవిని త‌మ అభ్య‌ర్ధిగా నిలబెడితే సత్ఫలితం వస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు.  మంగ‌ళ‌గిరిలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు కనుక బీసీ అభ్య‌ర్ధికే  అవ‌కాశాలుంటాయనీ, అందుకే  గంజి చిరంజీవి లోకేష్ కు దీటైన అభ్యర్థి అవుతారనీ జగన్ భావించారు. అందుకే అక్కడ సిట్టింగ్ గా ఉన్న  ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ని బుజ్జగించి ఒప్పించి మరీ చిరంజీవిని పార్టీలోకి లాక్కున్నారు.

ఇంత వరకూ బానే ఉంది కానీ , అయితే ఎంత బీసీల‌కు చెందిన‌వాడ‌యిన‌ప్ప‌టికీ చిరంజీవి ఇదే మంగ‌ళ‌గిరిలో 2014లో టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం వేవ్ లోనే గెలవలేక చతికిల బడ్డారు. అప్పుడే జనం తిరస్కరించిన అభ్యర్థిని ఇపుడు నిల‌బెట్ట‌డం వ‌ల్ల పార్టీ ఏమాత్రం ప్ర‌యో జ‌నం పొందుతుంద‌న్న అనుమానాలు త‌లెత్తాయి. అయితే ప్ర‌స్తుతం బీసీ ఓట‌ర్ల ప్రాధాన్య‌త‌ను లెక్క‌లోకి తీసుకుంటే ఆళ్ల కంటే చిరంజీవి బెట‌ర్ అని జగన్ నమ్మారు. అందుకే గాలం వేసి మరీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి గంజి చిరంజీవిని తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయ‌న‌కు కించిత్ ఇబ్బందీ లేకుండా చూసుకుంటామ‌ని అనేక హామీలు ఇచ్చారు. అంటే పోటీలో నిల‌బ‌డ‌టం వ‌రకే చిరంజీవి వంతు, ఖ‌ర్చు తదితర  వ్య‌వ‌హారాల‌న్నీవైసీపీయే చూసుకుంటుందన్న  భ‌రోసా ఇచ్చిన త‌ర్వాత‌నే చిరంజీవి చిర్న‌వ్వుతో వైసీపీ పంచ‌న చేరార‌న్న‌ది ప్ర‌చారంలో ఉంది. 

మంగ‌ళ‌గిరి సీటు, అందునా నారా లోకేష్‌ను ఓడించ‌డం.. ఈ రెండు వైసీపీకి అత్యంత ప్రాధాన్య అంశా లుగా మారాయి. మంగ‌ళ‌గిరిలో బీసీ ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. లోకేష్ త‌న చిర‌కాల శ‌తృవు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సుపుత్రుడు.   క‌నుక లోకేష్ పై విజయం సాధించడం ఒక్క టే జ‌గ‌న్   ల‌క్ష్యంగానూ మారింద‌నాలి.   కానీ టీడీపీ మాత్రం మంగ‌ళ‌గిరిలో విజ‌య‌ఢంకా మోగించేది నారావారి అబ్బాయే అన్న   ధీమాతో ఉంది. ఇటీవ‌లి కాలంలో రాష్ట్ర రాజకీయ వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పులు, ప్ర‌జ‌లు వైసీపీ మీద పెంచుకున్న ఆగ్ర‌హం త‌ప్ప‌కుండా లోకేష్‌కు ప్లస్ గా మార‌ను న్నా యి. ప‌థ‌కాలు, హామీలు అన్నీ నీరుగారాయి, ఏకంగా జ‌గ‌న్ మాట‌ను కూడా ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తు న్నారు, ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయుల స‌మ‌స్య ఆయ‌న‌కు త‌ల‌భారంగానే మారింది.  ఆచి తూచి అడుగులు వేయాల్సిన స‌మ‌యంలో దూకుడుగా, అనాలోచితంగా  తీసుకున్న నిర్ణ‌యాలు ఇపుడు మ‌రింత  ఇబ్బందిక‌రంగా మారాయి. 

అస‌లే అవ‌మాన‌పు త‌ల‌నొప్పుల‌తో ఇబ్బందిప‌డుతున్న జ‌గ‌న్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల మ‌రో శిరోభారం పెట్టాడు. అస‌లు లోకేష్ మీద పోటీ చేయ‌డానికి, గెల‌వ‌డానికి మంగ‌ళ‌గిరిలో త‌న‌ను మించిన‌వాడు లేడని తానే ఈ సారి పోటీలో నిలుస్తాన‌ని   తెర‌మీద‌కి మొద‌టి  కృష్ణుడిలా రంగప్రవేశం చేసేశారు. త‌న‌పై గ‌తంలో ఓడిపోయిన చిరంజీవికి పార్టీ టిక్కెట్ ఇవ్వ‌డ‌మేమిటి, త‌న‌ను తెర వెన‌క్కి వెళ్ల‌మ‌ని, ప్ర‌చారం చేయ‌మ‌ని అడ‌గడ‌మేమిట‌ని ఆగ్ర‌హిస్త‌ున్నారు. చిరంజీవి కేవ‌లం టీడీపీ నుంచి వ‌చ్చేడ‌న్న ప్రాధాన్య‌త త‌ప్ప మంగ‌ళ‌గిరిలో ఆయనకేమీ  ఫాలోయింగ్ లేద‌న్న‌ది ఆళ్ల వాద‌న‌. చిరంజీవిని పార్టీవారు ఎంతో స‌త్క‌రించి ఆయ‌న‌కు టికె ట్ ఇస్తామంటున్న స‌మ‌యంలో కూడా ఆళ్ల మీడియాతో అబ్బే అదేమీ లేదు, మంగ‌ళ‌గిరిలో పోటీ చేసేది తానే అని చెబుతున్నారు.

ఏది వాస్త‌వం, ఎవ‌రిది భ్ర‌మా అనేది ఇపుడు జ‌గ‌న్  తేల్చాల్సి ఉంది. మంగళగిరి లాంటి హాట్ సీట్  విషయంలో వైసీపీలో ఇంత గందరగోళం నెలకొని ఉండటమే ఆ పార్టీ బలహీనతకు దర్పణం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎంత మంది పార్టీలోకి వ‌చ్చి చేరినా తానే మంగళగిరిలో పోటీ చేస్తానని లోకేష్‌ను ఓడించే స‌త్తా త‌న‌కే ఉం ద‌ని ఆళ్ల‌  చెప్పుకుంటున్నారు. ఈ పరిణామంతో  గంజి చిరంజీవికి షాక్ ఖిన్నుడయ్యారు. రెడ్డి సామాజికవర్గం ఆడిన పొలి టికల్ గేమ్‌లో తాను పావునయ్యాయన్న ఫీలింగ్‌కు వచ్చారు. అయితే తాను ఇక దూకేశానని.. తనను జగన్ మోసం చేయరని ఒక దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు. కానీ మంగళగిరిలో గంజి చిరంజీవి నాయకత్వాన్ని వైసీసీ అంగీక రించడం లేదు.  ముఖ్యంగా గ‌తంలో త‌న‌ను ఓడించిన ఆళ్ల ఇపుడు తెర‌మీద‌కి రావ‌డం నేప‌థ్యంలో చిరంజీ వికి తన రాజకీయ భవిష్యత్ పై బెంగపట్టుకునే ఉంటుందని పరిశీలకలు అంటున్నారు. 

అయితే ఇవ‌న్నీ కేవ‌లం ఊహాగానాలే అని కొట్టి పారేసినా,  తాను పోటీ చేస్తున్నాన‌ని ఆళ్ల ప్ర‌క‌టించుకో వ‌డాన్ని జ‌గ‌న్ అడ్డుకోలేదు. ఆళ్ల ప్రకటనను ఖండించనూ లేదు.   అయినా ఇంత వరకూ వచ్చేసిన తరువాత ఆళ్ల తానే పోటీ చేస్తానంటూ ప్రకటించడం సీఎం జ‌గ‌న్‌కు కూడా  ఇబ్బందిక‌రంగానే మారింద‌నాలి. బుజ్జ‌గించి, బామాలి ఇప్పుడు కాదురా నాన్నా.. అని గ‌డ్డం ప‌ట్టుకుని చెప్పిన‌పుడు ఒకే అనేసి ఇపుడు ఎవ‌రో గిల్లిన‌ట్టు   మంగ‌ళ‌గిరిలో పోటీ చేస్తే తానే చేయాలంటూ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వైసీపీ నాయ‌కుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.   ఇక  ఇంటి అల్లుళ్ల పోరు తీర్చిన‌ట్టు  జ‌గ‌న్ ఇపుడు చిరంజీవిని, ఆళ్ల‌ను కూర్చోబెట్టి  బుజ్జగించడమే మిగిలింది. అయితే అంత కంటే ముందు మంగళగిరి వైసీపీలో విభేదాలు బట్టబయలై పార్టీ నియోజకవర్గంలో పలుచన అయ్యిందనడంలో సందేహం లేదు. అందుకు తంటా లు ప‌డాల్సింది, లాలిపాట‌లు పాడాల్సింది కూడా జ‌గ‌న్ మాత్ర‌మే. తెచ్చుకున్న‌వాడి కంటే ఉన్న‌వాడు తెచ్చిన తంటా అంతా యింతా కాదు.  

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.