ఇండియన్ సైంటిస్టులు... తెలుగు తీరంలో... 'సెంచరీ' కొడతారా?

Publish Date:Feb 14, 2017

Advertisement

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ... ఈ పేరు మన దేశంలోని ఒక సంస్థది మాత్రమే కాదు! నూరు కోట్ల భారతీయుల గర్వకారణం! స్థాపించినప్పటి నుంచీ ఇస్రో సంధించిన రాకెట్ ఏదీ గగనంలోకి విజయవంతంగా దూసుకుపోకుండా వున్నది లేదు. ఒకటి రెండు వైఫల్యాలే తప్ప ప్రపంచంలో ఇంత అద్బుత విజయ పరంపర మరే పరిశోధనా సంస్థ ఇప్పటి వరకూ సాధించలేదు. ఇక ఇప్పుడైతే అమెరికా, రష్యాల అంతరి పరిశోధనా శాస్త్రవేత్తలకి కూడా విస్మయం కలిగించే సైంటిఫిక్ ఫీట్ చేయబోతున్నారు ఇండియన్ జీనియస్ లు!

 


ఒకటి రెండు కాదు.. ఏకంగా వందకు మించి ఉపగ్రహాల్ని ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు ఇస్రో వారు! అంటే ఇండియన్ సైంటిస్టులు సాటిలైట్స్ సెంచరీ కొట్టనున్నారన్నమాట! ఇస్రో ఫిబ్రవరీ 15, 2017న పీఎస్ఎల్వీ సీ 37 రాకెట్ తో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని భూమికి 500కిలో మీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టనుంది! 104 సాటిలైట్స్ లో కేవలం 3 మాత్రమే మన దేశానివి! 88 అమెరికాకు చెందినవి! మిగతావి ఇజ్రాయిల్, ఖజక్ స్తాన్, నెదర్లాండ్స్, యూఏఈ లాంటి దేశాలవి!

 


ఒకప్పుడు టెక్నాలజీ కోసం మనమెంతో ఆధారపడ్డ రష్యా, అమెరికాలకే ఈ రోజు మనం ఉపగ్రహాల్ని ఆకాశా వీధిలో అలంకరించి పెడుతుండటం చాలా పెద్ద విజయం. ఇంత గొప్పగా అంతరిక్ష విజయాలు మరే దేశం సాధించలేదు గత యాభై ఏళ్లలో. ఇజ్రాయిల్, చైనా లాంటి దేశాలు రేసులో వున్నా మన ఇస్రో అంత చౌకగా, ప్రతిభవంతంగా ప్రయగాలు చేయటం, అవ్వి విజయవంతం కావటం మరెక్కడా లేదు!

 


ఇస్రో చేస్తోన్న 104 ఉపగ్రహాల సాహసం విజయవంతం అయితే ప్రపంచంలోనే ఇన్ని సాటిలైట్స్ ఒకేసారి లాంచ్ చేసిన దేశం మనదే అవుతుంది! అమెరికా 29, రష్యా 37 సాటిలైట్స్ లాంచ్ చేయగలిగాయి. గత సంవత్సరం ఇస్రోనే 20 ఉప గ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టి సత్తా చాటింది! ఇప్పటి వరకూ ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ల సాయంతో 39సార్లు ప్రయోగాలు చేసింది. అందులో 37సార్లు మనం విజయవంతం అయ్యాం. ఒకసారి పూర్తిగా విఫలం కాగా మరొకసారి పాక్షిక విజయం మాత్రమే దక్కింది. అంటే, ఇస్రో చేసిన పీఎస్ఎల్వీ లాంచింగ్స్ 97శాతం సక్సెస్ అయ్యాయన్నమాట! 

 


పీఎస్ఎల్వీ సాయంతోనే మన శాస్త్రవేత్తలు చంద్రయాన్, మంగళ్ యాన్ ప్రయోగాలు కూడా చారిత్రకంగా విజయవంతం చేశారు! బుధవారం మన శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న వంద ఉపగ్రహాలు కూడా విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోవాలని కోరుకుందాం! 

 


ఈ 104 ఉపగ్రహాల ప్రయోగం ఘన విజయం సాధిస్తే భారత్ అంతరిక్ష రంగంలో సరికొత్త బిజినెస్ మ్యాన్ అవుతుంది! ఆవును, ఇంతకాలం మనం మన కోసం పూర్తిగా ఖర్చు భరించుకుని ప్రయోగాలు చేశాం. ఇక మీద దేశదేశాల ఉపగ్రహాలు లాంచ్ చేస్తూ వాటి నుంచి విదేవీ మారక ద్రవ్యాన్ని, ద్వైపాక్షిక బంధాల్ని సంపాదించుకుంటూ ముందుకు పోవచ్చు! అంటే, మన ఉపగ్రహాలు ఇంచుమించూ ఫ్రీగా లాంచ్ చేసుకోవచ్చన్నమాట! ఇప్పుడు ప్రయోగిస్తున్న 104 సాటిలైట్స్ లో మనవి 3. వాటి లాంచ్ కి అయ్యే ఖర్చు అమెరికా, రష్యా, ఇతర దేశాలు పే చేస్తున్న బిల్ లోంచే సరిపోతోంది! ఇలా ఎన్నో విధాలుగా తాజా ప్రయోగం ఇస్రో చరిత్రలో, ఇండియా చరిత్రలో సరికొత్త ఆధ్యాయమే! 

By
en-us Political News

  
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.