RSS... దసరా నాడు ప్రారంభమైన దేశభక్తుల ఫ్యాక్టరీ!

Publish Date:Oct 10, 2016

Advertisement

అరెస్సెస్ ... అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్!ఈ పేరు వినగానే ముందు ఖాకీ నిక్కర్, తెల్ల చొక్కా, చేతిలో కర్రా గుర్తుకు వస్తాయి. కాని, ఆ వెంటనే కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు, ఇతర సెక్యులర్ పార్టీలు చేసే ఆరోపణలు గుర్తుకు వస్తాయి. దేశంలో ఏ చిన్న మతకలహం జరిగినా ఆరెస్సెస్ కారణం అనే రెడీమేడ్ స్టేట్మెంట్ వాళ్ల దగ్గర వుంటుంది! అసలు తమని తాము సెక్యులర్ నాయకులమని చెప్పుకునే కొందరైతే ప్రతీ దానికి అరెస్సెస్సే మూలమంటారు. ఆ మధ్య ముంబైపై పాకీ ఉగ్రవాదులు ఘోరమైన దాడి చేస్తే కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరెస్సెస్ చేసిందని అన్నాడు! అంతలా ఆరెస్సెస్ పై అవాకులు, చెవాకులు పేలుతుంటారు మన వాళ్లు! కాని, అసలింతకీ ఆరెస్సెస్ అంటే ఏంటి? 
ఆరెస్సెస్ గురించి తెలుసుకోటానికి దసర సమయమే చాలా సరైంది! ఎందుకంటే, ఇప్పటికి 92ఏళ్ల కింద సరిగ్గా విజయదశమి నాడే కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారు. విజయదశమి నాటి ఆ బీజం నిజంగా విజయవంతమై ఇవాళ్ల ప్రపంచపు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా రూపుదాల్చింది! చాలా మందికి ఆరెస్సెస్ అంటే మత సంస్థ అన్న ఫీలింగ్ వుంటుంది. కాని, అది నిజం కాదు. హిందూత్వ వినిపించే జనాల సమూహమే అయినప్పటికీ ఆరెస్సెస్ ప్రదానంగా స్వచ్ఛంద సంస్థ. దేశ వ్యాప్తంగా లక్షల మంది స్వయం సేవక్ లు వున్న ఎన్జీవో. ఎక్కడ వరదలొచ్చినా, ఎక్కడ భూకంపం సంభవించినా ఆరెస్సెస్ వాళ్లే ముందుంటారు. అయితే, మరో వైపు ఆరెస్సెస్ మత కలహాలకు కారణమని కూడా పదే పదే వినిపిస్తూ వుంటుంది. కాని, ఇంతవరకూ ఏనాడూ ఆ విషయం నిరూపించబడలేదు...
ఆరెస్సెస్ అధికారికంగా తనని తాను రాజకీయ సంస్థ కాదనే చెప్పుకుంటుంది. అయినా కూడా నాగపూర్ లోని ఆ సంస్థ హెడ్ ఆపీస్ కి ఢిల్లీ పీఠం పై తిరుగులేని ఆధిపత్యం వుందన్నది బహిరంగ రహస్యం. ఆరెస్సెస్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ఫోన్ చేసి పిలిస్తే ప్రధాని మోదీ కూడా వెంటనే ఆయన ముందు వాలిపోతారు. ఇది నిజమే. అయితే అంతకంటే నిజం ఏంటంటే ఏవో కొన్ని సలహాలు, సూచనలు వరకూ మాత్రమే ఆరెస్సెస్ పరిమితం అవుతూ వుంటుంది. అంతే కాని, ఒకప్పటి వాజ్ పేయ్, అద్వానీలు, ఇప్పటి మోదీ తమ సంఘం మనుషులు కాబట్టి నానా యాగీ చేయాలనుకోదు. మరీ ముఖ్యంగా, గత రెండున్నర ఏళ్ల నుంచీ నరేంద్ర మోదీ పీఎం అయ్యాక ఆయన పనుల్లో, నిర్ణయాల్లో ఆరెస్సెస్ పెద్దగా జోక్యం చేసుకోకపోవటం అందరికీ తెలిసిందే. ప్రతి పక్ష నేతలు రొటీన్ గా ఆరెస్సెస్ ను టార్గెట్ చేయటం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు... 
ఒక దేశానికి ప్రధానిని సైతం అందించగలగటం ఒక సంస్థకు మామూలు విషయం కాదు. కాని,ఆరెస్సెస్ 90ఏళ్ల సుదీర్థ ప్రయాణంలో ఆ విజయం సాధించింది. స్వాతంత్ర్యానికి ముందే హిందువుల కోసం, హిందూత్వ భావజాలం కోసం అది ఏర్పడ్డప్పటికీ ఏనాడూ రాజకీయం, అధికారం అన్నవాటికి దగ్గర వెళ్లలేదు. కనీసం ఆరాటపడటం కూడా జరగలేదు. 1981 తరువాత బీజేపీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అస్థిత్వంలోకి వచ్చాకే ఆరెస్సెస్ కు రాజకీయ అధికారం కొద్దికొద్దిగా చేరువవుతూ వచ్చింది. అయినప్పటికీ దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో కాషాయ దళం అధికారంలో వున్నా ఏనాడూ ఆరెస్సెస్ మైనార్టీల్ని వేధించటానికి దాన్ని ఉపయోగించుకోలేదు. ఆరోపణలు బోలెడు వున్నా కోర్టుల్లో మాత్రం ఎప్పుడూ, ఎవ్వరూ నిరూపించలేకపోయారు. గాంధీ హత్య మొదలు గోద్రా అల్లర్ల వరకూ ప్రతీ దానికి ఆరెస్సెస్ ను ముందుకు తీసుకురావటం మన దేశంలో పరిపాటినే. కాని, తాజాగా సుప్రీమ్ కోర్టు రాహుల్ గాంధీ చేత ఆరెస్సెస్ కు క్షమాపణ చెప్పించటం వరకూ ఏనాడూ చట్టబద్ధంగా ఈ హిందూ సంస్థని ఎవ్వరూ డికొట్టలేకపోయారు. అయితే, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు వీహెచ్ పీ, బజరంగ్ దళ్, ఇంకా బోలెడు పదే పదే కేసుల్లో ఇరుక్కుంటూ వస్తున్నాయి. వాటికి సంబంధించిన కొందరు కార్యకర్తలు శిక్షలు కూడా అనుభవిస్తున్నారు... 
లక్షల మందితో నడిచే ఒక సంస్థ ఆరోపణలు ఎదుర్కోవటం, కేసుల్లో ఇరుక్కోవటం ఆశ్చర్యకరమేం కాదు. పైగా యావత్ రాజకీయ వ్యవస్థ, మేధావులు, మీడియా వంటి అన్నీ అంశాలు వ్యతిరేకంగా వున్నప్పుడు ఇబ్బందులు రావటం మరింత సహజం. అయినా కూడా వందేళ్ల దిశగా పరుగులు పెడుతూ కూడా ఏమాత్రం విచ్ఛిన్నం కాకపోవటం ఆరెస్సెస్ ఘనత. దానిపై మనకు ఎలాంటి అభిప్రాయం వున్నా ఆ సక్సెస్ సీక్రెట్ మాత్రం గుర్తించాల్సిందే. వాళ్ల క్రమశిక్షణని, అంకితభావాన్ని అభినందించాల్సిందే! 
దసరా దసరాకు మళ్లీ మళ్లీ భరతమాత సేవకు అంకితమయ్యే ఆరెస్సెస్ స్వయం సేవక్ లు మిగతా ఎలాంటి ప్రేరణా ఇవ్వకున్నా... దేశభక్తి అనే తపన మాత్రం కలిగిస్తారు. అది అందరూ నేర్చుకోవాలి!  
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.