పాక్, చైనాలతో సరిహద్దు ఘర్షణలు శాశ్వితం?

Publish Date:Oct 22, 2014

Advertisement

 

పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడిన ప్రతీసారి, పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రజల దృష్టిని మళ్ళించేందుకు భారత్-పాక్ సరిహద్దులలో కాల్పులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ లో అటువంటి పరిస్థితే నెలకొని ఉండటంతో అలవాటు ప్రకారం పాక్ సైనికులు సరిహద్దుల వద్ద చెలరేగిపోయారు. పాక్ సైన్యాలు పేట్రేగిపోవడంతో భారత సైనిక దళాలు కూడా ధీటుగా బదులిచ్చాయి. పాకిస్తాన్ తక్షణమే కాల్పులు విరమించి వెనక్కి తగ్గకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో, పాక్ సైన్యాలు వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ మళ్ళీ షరా మామూలుగానే పాక్ సేనలు సరిహద్దుల వద్ద కాల్పులు మొదలుపెట్టాయి.

 

కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇచ్చిన సమాధానం పాక్ ప్రభుత్వ ఆలోచన తీరుకు అద్దం పట్టేదిగా ఉంది. పాకిస్తాన్ భారత్ తో సత్సంబంధాలే కోరుకొంటోందని, సరిహద్దుల వద్ద శాంతి నెలకొల్పాలని తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే, భారత్ దానిని తమ బలహీనతగా భావిస్తోందని ఆక్షేపించారు. భారత్ సేనలే సరిహద్దులలో పాక్ సైనికులపై దాడులు చేస్తూ, పాక్ ప్రభుత్వంపై నిందలు మోపడం చాలా విచారకరమని ఆయన అన్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? పాక్ ప్రధాని స్వయంగా ఈవిధంగా మాట్లాడుతుంటే పాక్ మీడియా వేరే విధంగా మాట్లాడుతుందని భావించలేము. మీడియా ప్రభావంతో అప్పుడు పాక్ ప్రజలు కూడా భారత్ సేనలే తమ దేశంపై దాడులకు తెగబడుతున్నాయని భావించడం సహజం.

 

పాక్ ప్రభుత్వం కూడా సరిగ్గా అదే కోరుకొంటోంది. తమ దేశానికి భారత్ వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందనే అభద్రతా భావం వారిలో స్థిరంగా నెలకొని ఉన్నప్పుడే వారు పాక్ ప్రభుత్వ అసమర్ధతను ఉపేక్షించే అవకాశం ఉంటుంది. లేకుంటే మళ్ళీ వారు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. అందువల్ల పాక్ ప్రభుత్వం తన దేశంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతీసారి భారత్-పాక్ సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టిస్తోంటుంది. ఈ ఉపాయంతో పాక్ ప్రభుత్వం తన ప్రజలను మభ్యపెడుతూ చాలా తెలివిగా తన అసమర్ధతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. కానీ దానివల్ల చివరకు ఆ దేశమే తీవ్రంగా నష్టపోతుంది.

 

భారతదేశం ఎన్నడూ కూడా ఇతరదేశాల మీదకు దండెత్తిన సందర్భాలు లేవు. కారణం అనాదిగా భారత్ సుసంపన్నమయిన దేశం కావడమే. నేటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా పేరు తెచ్చుకొంది తప్ప ఇరుగు పొరుగుదేశాల సరిహద్దులలో జొరబడి ఆక్రమించుకొంటుందనే విమర్శ ఎన్నడూ వినబడలేదు. నిజానికి భారత్ తలుచుకొంటే ఏనాడో పాక్ ఆక్రమిత కాశ్మీరును కూడా తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకొనేది. కానీ ఆపని చేయకపోవడానికి కారణం భారత్ శాంతికాముక దేశం కావడమే.

 

జాతిపిత మహాత్మా గాంధీ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టేందుకు, బ్రిటిష్ సైనికుల చేతుల్లో లాటీ దెబ్బలు తినేందుకే సిద్దపడ్డారు తప్ప వారి మీద తన చేతి కర్ర ఎత్తాలని ఎన్నడూ ఆలోచించలేదు. ఆయన కర్ర ఎత్తి ఉండిఉంటే భారతదేశ భూత, భవిష్యత్ చరిత్ర మరో విధంగా ఉండేదేమో! ఆనాటి నుండి ఈనాటి వరకు దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా అన్నీ కూడా ఆయన చూపిన శాంతి మార్గంలోనే పయనిస్తున్నాయి. అందుకే కాశ్మీరులో కొంత భాగం పాక్ సేనలు ఆక్రమించుకొన్నప్పుడు అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ వారిని భారత భూభాగం నుండి తరిమికొట్టకపోగా, ఐక్యరాజ్యసమితికి పోయి మొరపెట్టుకొన్నారు.

 

భారత్ యొక్క ఆ శాంతికాముకతే నేడు చైనా, పాక్ వంటి దేశాలకు అసమర్దతగా కనబడుతోంది. అందుకే అవి భారతదేశంతో నిత్యం చెలగాటం ఆడే సాహసం చేయగలుగుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం “ఇప్పుడు భారత్ లో కొత్త ప్రభుత్వం వచ్చిందని, అందువల్ల మారిన ఆలోచనా విధానాన్ని, మారిన పరిస్థితులను కూడా గుర్తించమని, లేకుంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని” పాక్, చైనా దేశాలకు చాలా గట్టి హెచ్చరికలే చేసింది. కానీ అంత మాత్రాన్న ఆ రెండు దేశాల ధోరణి మారుతుందని ఆశించడం కష్టం. ఎందువలన అంటే చైనాకు సామ్రాజ్య విస్తరణ కాంక్ష విపరీతంగా ఉంటే, పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. కనుక ఆ రెండు దేశాలు ఎన్నటికీ తమ వైఖరిని మార్చుకొనే అవకాశంలేదనే భావించవచ్చును. కనుక భారత్ ఎంత శాంతి కాముక దేశం అయినప్పటికీ సరిహద్దుల వద్ద ఆ రెండు దేశాలతో సమస్యలు తప్పవనే చెప్పవచ్చును.

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.