కరోనాతో జంటలలో పునరుత్పత్తి ఆగిపోతోందా?

Publish Date:Aug 14, 2020

Advertisement

లాక్డౌన్ సమయంలో కొత్త దంపతులు, ఇంటి పట్టున ఉంటున్న భార్యభర్తలు అనేక మంది సమయం దొరకడంతో దాంపత్య జీవితం మీదనే పూర్తి ఫోకస్ పెట్టి ఎంజాయ్ చేశారనే వార్తలు చూశాం కానీ అదే జంటలు పునరుత్పత్తి అంటే మాత్రం తెగ భయపడిపోతున్నాయట. ప్రఖ్యాతి గాంచిన జర్నల్ ఆఫ్ సైకో సొమాటిక్ రీసెర్చ్ గైనకాలజీ ఇటీవల ఇదే విషయం మీద ఒక స్టడీ నిర్వహించింది. మన దేశంతో సహా అనేక దేశాలలో జంటలు కరోనా సమయంలో తల్లిదండ్రులు కాకూడదు అనుకుంటున్నారు. గర్భం దాల్చినపుడు కరోనా సోకితే కష్టమనే భయం ఇందుకు ప్రధాన కారణం. సర్వే లో పాల్గొన్న 73 శాతం మంది ఇదే రకం అభిప్రాయం వెలిబుచ్చారట. ఇందుకు మనదేశంలోని నగరాలు కూడా మినహాయింపు కాదట. గర్భం వస్తే ప్రతి నెల చెకప్కు ఆసుప్రతికి వెళ్ళవలసి రావడం , డాక్టర్లు ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడం, డాక్టర్లు కూడా ఎక్కువ మంది పేషెంట్లను డైరెక్టుగా చూడకుండా ఆన్ లైన్ లో కౌన్సలింగ్ చేస్తామనడం ఇందుకు కారణం. చాలా మంది జంటల్లో ఇంకో భయం కూడా ఉంది, కరోనా కాలంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడం, ఉద్యోగాలకు గ్యారంటీ లేకపోవడం కూడా కారణమట. సర్వేలో పాల్గొన్న గైనకాలజిస్టులు కూడా తాము దంపతులకు ప్రస్తుతానికి ప్రెగెన్సీని పోస్ట్ పోన్ చేసుకోమని చెబుతున్నానమని, చాలా మంది అందుకు ఒప్పుకుంటున్నారని అంటున్నారట. 

 

ఇదంతా ఉద్యోగాల మీద ఆధారపడ్డ జంటల సంగతి అయితే మన హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ఇంకో నయా ట్రెండ్ నడుస్తోంది. డబ్బుల కోసం అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్లు చేసే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రం సిజేరియన్లు చేయం అని చెప్పేస్తున్నారట. ఇందుకు డాక్టర్లలో కరోనా భయమే కారణం. సిటీలో ఒక ప్రముఖ గైనకాలజిస్టు ఏం చెప్పారంటే ఇపుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎవరికైనా ఏ సర్జరీ కానీ, ఏ మెడికల్ ప్రొసీజర్ చేసే ముందు కానీ కరోనా టెస్ట్ చేయాలన్న రూల్ పెట్టలేదు. 

 

మామూలుగా కరోనా పేషెంట్ తుమ్మినపుడో, దగ్గినపుడో కన్నా వారికి ఏదైనా సర్జరీ జరిగి శరీరాయవాలను ఓపెన్ చేసినపుడు రోగి లోపలున్న వైరల్ లోడ్ చాలా డైరెక్టుగా బయటకు ఎక్స్ పోజ్ అవుతుందట. దాంతో డాక్టర్లు, నర్సులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ అంటుకోవచ్చన్న భయం ఉందట. ఆ మధ్య కాలంలో నిమ్స్ లో డాకర్లు అనేక మంది ఒక్కసారిగా కరోనా పాజిటివ్ అయ్యారు. దానికి కారణం అక్కడ ఒకరిద్దరు పేషెంట్లకు సర్జరీ జరిగినపుడు వారికి ఆల్ రెడీ కరోనా సోకి ఉండటం, సర్జరీ అపుడు వైరల్ లోడ్ అందరికీ ఎక్స్ పోజయి కొందరు డాక్టర్లు వైరస్ బారిన పడటం జరిగింది. ఇంత భయాలున్న చోట అటు డాక్టర్లు, ఇటు జంటలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకపోవడం విచిత్రం ఏమీ కాదు. ఇక నలభై యేళ్ళ లేటు వయసులో కరీనా, అంతకన్నా మరీ లేటు వయసులో సైఫ్ అలీ ఖాన్ తల్లితండ్రులం కాబోతున్నామని ప్రకటన చేశారు. వారు సెలబ్రిటీలు కాబట్టి వారికి ఏం చేసినా  నడుస్తోంది కానీ మామూలు జంటలు మాత్రం ఇపుడు ప్రెగ్నెన్సీ అంటే సుముఖంగా లేరని తెలుస్తోంది. సిటీలో ఇపుడు వెలవెలబోతున్న ఫర్టిలిటీ సెంటర్లే ఇందుకు ఉదాహరణ. 

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.