Publish Date:Mar 13, 2026
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురువారం తన రిజిస్ట్రేషన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది.హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి రిజిస్ట్రేషన్లు ఇవే కావడం విశేషం.
ముఖ్యమైన మార్పులు ఇవే:
వేతనానికి ప్రాధాన్యం: లాటరీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై ఎక్కువ వేతనం పొందే నిపుణులకు లాటరీలో అధిక ప్రాధాన్యం లభిస్తుంది.
కంపెనీలపై ప్రభావం : ఈ మార్పుల వల్ల కన్సల్టెన్సీల ద్వారా జరిగే నియామకాలపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, సీనియర్ నిపుణులను నియమించుకునే పెద్ద కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.
ఫీజు వివరాలు : ప్రతి రిజిస్ట్రేషన్కు కంపెనీలు 215 డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి ఎంపికైతే, వేతన ప్యాకేజీ ఇతర ఖర్చులతో కలిపి కంపెనీలు సుమారు లక్ష డాలర్ల వరకు వెచ్చించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వీసాల కోటా:
హెచ్-1బీ వీసాలకు ఏటా భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం 85,000 వీసాలను మాత్రమే యూఎస్ ప్రభుత్వం జారీ చేస్తుంది.వీటిలో 20,000 వీసాలు అమెరికా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య (మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ) పూర్తి చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు.మిగిలిన 65,000 వీసాలు జనరల్ కేటగిరీ కింద అందరికీ అందుబాటులో ఉంటాయి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hb1-vesa-36-215446.html
మావోయిస్టు కీలక నేత, కొంత కాలం కిందట ఎన్ కౌంటర్ లో హతమైన హిడ్మా గతంలో పీఎల్ జీఏ బాధ్యతల నుంచి తప్పుకుని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ వైపు వెళ్లిన తరువాత దళాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పీఎల్ జీఏ బెటాలియన్ కమాండర్గా బడ్సే దేవాను నియమించగా, డిప్యూటీ కమాండర్ బాధ్యత లను సోది కేశాలకు అప్పగిం చారు.
మల్లె, కనకాంబరం, రోజా, చామంతి వంటి సుగంధ పుష్పాలతో పాటు తులసి వంటి పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్ప నీరాజనం సమర్పించారు. గంటల తరబడి సాగిన ఈ పుష్పాభిషేకం చూసి భక్తులు పులకించిపోయారు.
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు ఫ్రంట్లైన్ ప్రెస్ పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వీరు ఆదివారం వెళ్లారు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, మహ్మద్ షమీ అదిరిపోయే వ్యూహంతో వారిని దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికే షమీ వేసిన స్లోయర్ డెలివరీని అర్థం చేసుకోవడంలో అభిషేక్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ దిశగా వెళ్లగా, అక్కడ ఉన్న మనిమారన్ సిద్ధార్థ్ అద్భుతమైన డైవ్తో క్యాచ్ పట్టాడు.
మంగళవారం ) పవర్ ప్లాంట్స్పై దాడులు, బ్రిడ్జ్పై దాడులు అన్నీ కలగలిపి ఉంటాయి. ఇలాంటిది మునుపెన్నడూ చూసి ఉండరు. హోర్ముజ్ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి అంటూ అని బూతులతో ట్రంప్ చెలరేగిపోయారు.
చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో చైన్నైని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్కోరు.
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.