హెచ్ -1బీ ఉద్యోగులకు గూగుల్ సంస్థ గుడ్ న్యూస్

Publish Date:Dec 23, 2025

Advertisement

 

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేచి చూస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు గూగుల్ ముందస్తు 'న్యూ ఇయర్' గిఫ్ట్ ఇచ్చింది. 2023లో లేఆఫ్స్ కారణంగా నిలిపివేసిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్  ప్రక్రియను 2026 నుంచి మళ్లీ పట్టాలెక్కించనున్నట్లు కంపెనీ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ అవకాశం అందరికీ వర్తించదు. కేవలం ఆఫీసు నుంచి పనిచేసే వారికి, మెరుగైన పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్నవారికే గూగుల్ ప్రాధాన్యత ఇవ్వనుంది. 

ఆ క్రమంలో అమెరికాలోని టెక్ దిగ్గజం గూగుల్‌లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. గత రెండేళ్లుగా నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను 2026 నుంచి భారీ ఎత్తున తిరిగి ప్రారంభించనున్నట్లు కంపెనీ తన అంతర్గత వర్గాల ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు డిసెంబర్ నెలలో ఉద్యోగులకు పంపిన న్యూస్ లెటర్‌లో కంపెనీ తన ప్రణాళికలను వివరించింది. 

అమెరికాలో విదేశీ ఉద్యోగి శాశ్వత నివాసాన్ని కల్పించే గ్రీన్ కార్డ్ పొందాలంటే.. ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రీవ్యూ మేనేజ్‌మెంట్ అనేది అత్యంత కీలకమైనది. దీని ద్వారా కంపెనీలు సదరు ఉద్యోగి చేసే పనికి తగిన అమెరికన్ అభ్యర్థులు అందుబాటులో లేరని ప్రభుత్వం ముందు నిరూపించాల్సి ఉంటుంది. 2023 జనవరిలో గూగుల్ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించిన సమయంలో.. నియమ నిబంధనల దృష్ట్యా ఈ ప్రక్రియను నిలిపివేసింది. అమేజాన్, మెటా వంటి సంస్థలు కూడా అదే దారిలో వెళ్లడంతో వేలాది మంది టెక్కీలు గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకోలేక అనిశ్చితిలో పడిపోయారు.

అయితే 2026 మొదటి త్రైమాసికం నుంచి గూగుల్ నియమించుకున్న న్యాయ సంస్థలు అర్హులైన ఉద్యోగులను సంప్రదించడం ప్రారంభిస్తాయి. 2026 ఏడాది పొడవునా పీఈఆర్‌ఎమ్ దరఖాస్తులను పెంచుకుంటూ వెళ్లాలని గూగుల్ భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియకు గూగుల్ కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించింది. ముఖ్యంగా గూగుల్ ఉద్యోగులు అందరికీ ఈ స్పాన్సర్‌షిప్ లభించదు. పీఈఆర్‌ఎమ్ కావాలనుకునే వారు కచ్చితంగా గూగుల్ కార్యాలయం నుంచే పనిచేయాలి. 

ప్రస్తుతం రిమోట్ లో ఉన్నవారు గ్రీన్ కార్డ్ ప్రక్రియ కోసం ఆఫీసు ఉన్న ప్రాంతానికి తరలి రావాల్సి ఉంటుంది. అలాగే సదరు ఉద్యోగి కచ్చితంగా ఒక ప్రత్యేక డిగ్రీ, పని అనుభవం ఉన్న ధృవీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా లెవల్-3, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారికి అవకాశం తక్కువని కూడా కంపెనీ పేర్కొంది. అలాగే వార్షిక సమీక్షలో 'మోడరేట్ ఇంపాక్ట్' లేదా అంతకంటే మెరుగైన రేటింగ్ పొందిన వారికి మాత్రమే స్పాన్సర్‌షిప్ లభిస్తుంది. 

అలాగే కంపెనీలో మంచి పనితీరు కనబరిచే వారికే ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవలి కాలంలో వీసా ఫీజులు పెరగడం, ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వంటి కారణాలతో అమెరికాలోని భారతీయ టెక్కీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గూగుల్ కూడా తన ఉద్యోగులను అనవసరంగా దేశం దాటి వెళ్లవద్దని.. వీసా స్టాంపింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. గూగుల్ గ్రీన్ కార్డ్ ప్రక్రియను మళ్లీ పట్టాలెక్కించడం వేలాది మంది భారతీయ కుటుంబాలకు పెద్ద ఉపశమనం కానుంది.
 

By
en-us Political News

  
తిరుప‌తి గోవింద‌రాజుల వారి ఆనంద నిల‌యం బంగారు తాప‌డం చేయించ‌డానికి 100 కిలోల బంగారం కేటాయించారు.
హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌదరీ తన కొడుకు పెళ్లి విందు అత్యంత వైభవంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం నియమించింది.
దశాబ్దాల కాలంగా భారతీయ డాక్టర్లకు కలల గమ్యస్థానంగా ఉన్న బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.
బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.
విద్యార్థుల్లో నైపుణ్యం కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్న ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా సౌదీ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి.
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రఘునాథ్‌ అనుమానాస్పద మృతి కేసులో మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్‌ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌, కుమార్తె కల్పజ, డీఎస్పీ మోహన్‌ను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.