మాజీ ఎంపీ కనకమేడలకు కీలక పదవి

Publish Date:Dec 23, 2025

Advertisement

 

సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం నియమించింది. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో పాటుదవీందర్‌పాల్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినేట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనకమేడల  నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవానికి, సామర్థ్యానికి గుర్తింపుగా రాజకీయ, న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ జీవితంతో పాటు న్యాయరంగంలోనూ చురుకైన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు దేశస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. 

ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్యాంగపరమైన కీలక వివాదాల్లో ప్రభుత్వ వాదనను ఆయన బలంగా వినిపిస్తారని కేంద్రం భావిస్తోంది. రవీంద్ర కుమార్‌కు ఈ పదవి వరించడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుభవజ్ఞుడైన న్యాయవాదికి ఈ పదవి రావడం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరుస్తోందని తెలుగు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులకు తోడు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి.
ఎల్‌వీఎం3-ఎం6 బాహుబలి రాకెట్ అమెరికాకు చెంది భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ని నింగిలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు ఆరువేల ఒక వంద కిలోలు.
న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు, ప్రజలు హద్దులు దాటినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తిరుప‌తి గోవింద‌రాజుల వారి ఆనంద నిల‌యం బంగారు తాప‌డం చేయించ‌డానికి 100 కిలోల బంగారం కేటాయించారు.
హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ సాంచీ ఎమ్మెల్యే ప్రభు రామ్ చౌదరీ తన కొడుకు పెళ్లి విందు అత్యంత వైభవంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
దశాబ్దాల కాలంగా భారతీయ డాక్టర్లకు కలల గమ్యస్థానంగా ఉన్న బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతోంది.
విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు గూగుల్ ముందస్తు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు బండి సంజయ్ కుమార్ తెలిపారు.
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.
బంగ్లాదేశ్‌లో హిందూవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఢిల్లీలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.
విద్యార్థుల్లో నైపుణ్యం కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.