Publish Date:Dec 23, 2025
ఇప్పటికే లడ్డూ, ఆపై పరకామణి.. ఇప్పుడు చూస్తే తిరుపతి గోవిందరాజ స్వామి గోపురానికి బంగారు తాపడం వ్యవహారం. గత వైసీపీ జమానాలో.. తిరుమల శ్రీవారి చుట్టూ ఇలా ఎన్నో వివాదాలు అల్లుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. తిరుపతి గోవిందరాజుల వారి ఆనంద నిలయం బంగారు తాపడం చేయించడానికి 100 కిలోల బంగారం కేటాయించారు. మొత్తం 9 లేయర్లుండగా.. వీటిలో రెండు లేయర్లు మాత్రమే వాడి మిగిలిన ఏడు లేయర్ల బంగారం పక్కదారిపట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ తాపడం సమయంలో 30 పురాతన విగ్రహాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీనంతటికీ కారణం అన్యమతస్తులకు ఈ పనులు అప్పగించినట్టు సమాచారం. దీంతో హిందూ సంఘాల వారు ఈ విషయంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇదే అంశంపై గతంలో ఏఈఓగా పని చేసిన సుబ్బరాజు చెప్పడాన్ని బట్టీ చూస్తుంటే అలాంటిదేమీ లేదని అంటున్నారాయన. అన్యమతస్తులకు పనులు అప్పగించామన్న మాట కూడా కరెక్టు కాదంటున్నారు. సంచలనం కోసమే కొన్ని హిందూ సంఘాలు ఇలాంటి ఆరోపణలు చేసినట్టు వివరించారాయన.
అయితే ఈ విషయంపై మాట్లాడిన జనసేన నేత కిరణ్ రాయల్.. ఇదంతా సంచలనం కోసమో రాజకీయాల కోసమే చేస్తున్న పోరాటం కాదు. ఇదంతా ఆ స్వామి వారే తన విషయంలో జరిగిన తప్పులను తాను సరిదిద్దుకుంటున్నారు. ఆ మాటకొస్తే ఇది ఒక రాజకీయ నాయకులు బయట పెట్టినదేం కాదు. ఒక సామాన్యుడి రూపంలో స్వామివారే ఇదంతా వెలుగులోకి తెచ్చారని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్ మేమంతా నిమిత్త మాత్రులం అని అన్నారు కిరణ్ రాయల్. ఇందులో రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగిందనడం కన్నా.. మోసం జరిగిందని చెప్పాల్సి ఉంటుందని అన్నారు కిరణ్ రాయల్. ఈ మొత్తం వ్యహారం గుర్తించిన టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించింది. గోపురానికి బంగారు తాపడంలో అవినీతి అక్రమాలు జరిగినట్టు తెలిస్తే ఎంత పెద్ద వారినైనా వదలకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tirumala-36-211467.html
ఈ సంస్థ వలలో పడి 1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని తేలింది. ఈ సంస్థపై కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోకూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 48 గంటలలో ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆ వెంటనే కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ, బీఆర్ఎస్ ద్వారా తనకు లభించిన శాసనమండలి సభ్యత్వానికి కూడా అప్పుడే రాజీనామా చేశారు. ఆ రాజీనామాను మండలి చైర్మన్ ఇప్పుడు ఆమోదించారు.
బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.
పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే 13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదని పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.