Publish Date:Jun 25, 2021
ఆడవాళ్లు శాంతగా ఉన్నంత సేపు శాంత మూర్తులు. ఒక సారి అదే ఆడవాళ్ళూ ఉగ్ర రూపం దాలిస్తే కాళికాదేవి అవతారు కూడా ఎత్తుతారు.. తాజాగా లైంగికంగా వేధిస్తున్న గ్రామ సర్పంచ్ భర్తను ఓ యువతి కాల్చి చంపింది.. ఘటన వివరాల్లోకి వెళితే గ్రామ సర్పంచ్ భర్త రామ్సరన్, సర్పంచ్ అంటే గ్రామం లోనే కాదు మన దేశంలో కూడా ఒక ఉన్నతమైన హోదా ఉంది. గ్రామంలో చాలా హుందాగా ఉండాలి. అందరికి ఆదర్శనంగా ఉండాలి. సర్పంచ్ ఎంత గౌరవంగా ఉంటాడో వాళ్లకు కుటుంబ సభ్యులు కూడా అంతే గౌరవంగా ఉండాలి. అయితే ఒక సర్పంచ్ భర్త ఆ గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతిని గత రెండుళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. అంతే కాదు ఆమెపై భౌతిక దాడికి దిగుతూ హింసిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా రామ్సరన్ అరాచకం ఎక్కువై పోయింది. నిత్యం ఆమెను వేధింపులకు గురి చేస్తుండే వాడు. దీంతో అతడి బాధ భరించలేకపోయింది ఆ యువతి. ఇంట్లో సోదరుడికి, తల్లికి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి రామ్సరన్ భరతం పట్టాలని ఫిక్స్ అయ్యారు. పధకం వేశారు. పంచాయితీ చెయ్యాలంటూ ఆదివారం బాధిత యువతి సోదరుడు రామ్సరన్ ను ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దీ సేపు అతడితో మాట్లాడాడు బాధిత యువతి సోదరుడు. ఇద్దరు మాట్లాడుతున్న సమయంలోనే యువతి రామ్సరన్ ను వెనక నుంచి నాటు తుపాకీతో కాల్చింది. ఆ నాటు తుపాకీ పేలగానే అక్కడ ఉన్న ఊరి జనం అంత ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే ఆ సర్పంచ్ భర్త మృతి చెందాడు. హత్య అనంతరం యువతి, ఆమె సోదరుడు.. ఫరూఖాబాద్ కు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రామ్సరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి హత్య చేసినట్లు నిర్దారించారు పోలీసులు. ఫరూఖాబాద్ లో ఉన్న యువతిని, ఆమె సోదరుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం యువతిని విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయం పోలీసులకు పూసా గుచ్చినట్లు తెలిపింది. గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని. సహకరించకపోతే ఇంట్లో వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడని.. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమెకు వేరే మార్గం కనిపించలేదని అందుకే హత్య చేశానని ఆ యువతీ తెలిపింది. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా జలాల్పూర్ అమ్రా గ్రామంలో చోటుచేసుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/girl-shoots-village-sarpanch-husband-25-118350.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.