తెరాసకి మజ్లిస్ తలాక్ చెప్పబోతోందా?

Publish Date:Dec 22, 2014

Advertisement

 

బ్రిటిష్ వాడు నేర్పిన ‘విభజించి పాలించు’ అనే ఐడియా వాడికి గుర్తుందో లేదో తెలియదు కానీ మనోళ్ళు మాత్రం దానిని ఔపోసన పట్టేసారని చెప్పవచ్చును. అయితే ఒక్కోసారి అది రాష్ట్ర విభజన వ్యవహారంలా ఎదురు తంతుంటుంది. అయినా దాని మీద మనోళ్ళకి ఉన్న మోజు అంతా ఇంతా కాదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తే తెరాస వచ్చేసింది. అయితే తెరాస తెలంగాణా రాష్ట్రాన్ని ఏలేస్తున్నప్పటికీ, రాజధాని హైదరబాద్ పై అందునా జి.హెచ్.యం.సి.పై తమ పార్టీకి బొత్తిగా పట్టులేకపోవడం కొంచెం బాధగానే ఉంటుంది. అందుకే జి.హెచ్.యం.సి. పరిధిలో ఓట్లన్నిటికీ పూర్తి పేటెంట్ హక్కులు ఉన్నాయని భావిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్గంలోకి వచ్చి పడ్డారు, మజ్లిస్ పార్టీతో తెరాసకి దోస్తీ కుదిరింది.

 

అయితే అంతమాత్రాన్న జి.హెచ్.యం.సి.లో తెరాస పాగా వేసేస్తుందనే గ్యారంటీ లేదు. కనుక తన ప్రత్యర్ధులను బలహీనపరచాలంటే వారు బలంగా ఉన్న వార్డులను రెండు ముక్కలుగానో వీలయితే మూడు ముక్కలుగానో విభజించడమే మంచి పద్ధతని తెరాస భావిస్తుండటంతో ప్రస్తుతం 155 వార్డులను 175 గా పునర్విభజన చేసేందుకు సిద్దమవుతోంది. అందులో మళ్ళీ మహిళలకు 50శాతం కోటా, యస్సీ, ఎస్టీ, బీసీలకు వేర్వేరుగా కోటాలు షరా మామూలే. ఇటువంటివి జీర్ణించుకోవడం ప్రత్యర్ధ పార్టీలకు వీలవుతుందేమో కానీ కేవలం ముస్లిం ప్రజల ఓట్ల మీదనే ఆధారపడిన మజ్లిస్ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చును. అందుకే అది తెరాసపై గుర్రుగా ఉందిపుడు.

 

ఈ వార్డుల పునర్విభజన, ఆ వంకతో ఎన్నికలు వాయిదా వేసుకొంటూపోవడం ఆ పార్టీకి చాలా కోపం తెప్పిస్తోంది. 155 మంది సభ్యులున్న జి..హెచ్.యం.సి. బోర్డు డిశంబర్ మూడున రద్దయిపోయింది. కనుక తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమేశ్ కుమార్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అంటే ఆయన ద్వారా పరోక్షంగా తను అధికారం చెప్పట్టిందని అర్ధమవుతోంది. జి.హెచ్.యం.సి. రద్దయిన తరువాత ఆరు నెలలోగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది కనుక ప్రభుత్వం కూడా ఏమీ తొందరపడటం లేదు. అయితే అంతవరకు మజ్లిస్ పార్టీ నేతలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. కనుక మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ తక్షణమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరపాలని గట్టిగా పట్టుబడుతున్నారు.

 

ఎన్నికలు ఆలశ్యం జరుగుతున్న కొద్దీ తెదేపా-బీజేపీలు, కాంగ్రెస్, తెరాస పార్టీలు అన్నీ క్రమంగా బలపడితే అసలుకే ఎసరు వస్తుందని మజ్లిస్ బెంగపెట్టుకొంది. అయితే ఆ మాట పైకి చెప్పకుండా జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్త సభ్యులు బాధ్యతలు చెప్పట్టేవరకు కేంద్రం నుండి జి.హెచ్.యం.సి.కి రావలసిన నిధుల విడుదల ఆగిపోతుందని, అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న జి.హెచ్.యం.సి. ఇంకా కష్టాలలోకి కూరుకు పోతుందని మజ్లిస్ నేతలు వాదిస్తున్నారు.

 

కానీ, నిన్నమొన్ననే తలసానిని పార్టీలోకి రప్పించుకొన్న తెరాస, వెంటనే ఎన్నికలు నిర్వహించినా గెలవడం కష్టమని భావిస్తున్నందున ముందుగా జి.హెచ్.యం.సి. పరిధిలో పార్టీ కొంత బలపడిన తరువాత అప్పుడు నిర్వహించడం మేలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన మజ్లిస్ పార్టీని కుష్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైల్ అలైన్ మెంటులో మార్పులు చేర్పులు చేసి చూసారు. కానీ ఆ తరువాత కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన నగరంలో పేదలకు 125 గజాల స్థలం ఉచితంగా క్రమబద్దీకరణ పట్ల మజ్లిస్ నేతలు గుర్రుగా ఉన్నారు.

 

మజ్లిస్ పార్టీతో దోస్తీ అంటూనే తెరాస తమను పట్టించుకోవడం లేదని, పైగా తమకే ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని వారు వాపోతున్నారు. తమను సంప్రదించకుండా వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించిన వారికి భూములు క్రమబద్దీకరిస్తామని చెప్పడాన్ని మజ్లీస్ నేతలు తప్పుపడుతున్నారు. వారి బాధ ఎలా ఉన్నప్పటికీ, జి..హెచ్.యం.సి.పై పూర్తి పట్టు సాధించడమే ధ్యేయంగా తెరాస అడుగులు వేస్తోంది. అందువలన ఏదో ఆనాడు మజ్లీస్ పార్టీ తెరాసకు తలాక్ తలాక్ తలాక్ చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ చెయ్యందుకొన్నా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.