Publish Date:Aug 30, 2022
కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఆయా సంఘటనల్లో పిల్ల లూ హీరోలయిపోతుంటారు. ఊహించని సంఘటనల్లో ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచనలతో వెంటనే స్పందించడం అనేది అవతలివారికి ఎంతో మేలు చేస్తుంది. గెవిన్ తన తల్లిని కాపాడాడు.
పదేళ్ల గెవిన్ ఏం చదువుతున్నాడు, బడికి సరిగా వెళుతున్నాడా, గుడ్ స్టూడెంటా.. అనే ప్రశ్నలతో చుట్టు పక్కలవారూ, పక్కంటి పిన్నిగారూ వేధించలేదు. గెవిన్ ని తమ ఊరు హీరో అనేశారు. పిల్లవాడయినా ఎంత వేగంగా, చురుగ్గా ఆలోచించాడమ్మా.. అనుకున్నారు వెనకింటి బామ్మగారు, ఎదురింటి బాబాయి గారూ .. పిల్లడు పదేళ్లవాడయితేనేమి.. వాళ్ల డాడీ ఇవ్వాల్సిన రక్షణ వాడే చేసేడన్నారంతా.
ఓక్లహామాలో ఓ చిన్న కుటుంబం. తల్లీ, పిల్లడూ స్విమింగ్పూల్లో ఆడుకోవడం ఓ సరదా. కానీ మొన్నీ మధ్య తల్లి ఒక్కతే స్విమింగ్పూల్లో దిగింది. పిల్లడు ఎక్కడో ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆమె మామూ లుగానే పాడుకుంటూ తిరుగుతూంది. పిల్లాడి కోసం ఎదురుచూస్తోంది. పిలుద్దామనే అనుకుంది. కానీ అంతలోనే హఠాత్తుగా ఆమె పల్టీకొట్టింది. ఊపిరాడనంత పనయింది. నీళ్లు మింగేసింది. నీటిలోకి దిగిపోయేలోగానే అదృష్టం ఆమెను రక్షించింది. సరిగ్గా అప్పుడే ఆమె పదేళ్ల పిల్లవాడు గెవిన్ అటుగా వచ్చాడు. తల్లి అరుపులు విని పరుగున స్విమ్మింగ్పూల్లోకి అమాంతం దూకేశాడు. చిత్రమేమంటే ఆమెను బయటికి లాగేయగలిగాడు. అదీ ఆమె మొహాన్ని నీటి పైకి పట్టుకుని పూల్ చివర ఉన్న మెట్లమీద వరకూ తీసుకువచ్చి ఆమెను పైకి లాగేడు. అంతలో తండ్రి పరుగున వచ్చాడు.
ఇదెలా సాధ్యం.. అన్న ప్రశ్నకంటే పిల్లాడు ప్రదర్శించిన తెలివినే అందరూ మెచ్చకున్నారు. నీటిలో మునిగిపోతున్న తల్లి అరవగానే దూకడం సరే. కానీ అంత మనిషిని వాడు మెడపట్టుకుని తలను నీటి పైనే ఉంచేట్టు చేసి తీసుకురావడమే గొప్ప విషయమని అన్నారంతా. మనూళ్లో అయితే దీన్నే దైవేచ్ఛ అనేవారు. ఏమయినప్పటికీ ఓక్లహామాలో గెవిన్ నివాస ప్రాంతంలో మాత్రం గొప్ప హీరోగా అందరి మెప్పూ పొందుతున్నాడు.
ఆ తల్లి ఫేస్బుక్లో తన గెవిన్ తనకు దేవుడు అంటూ రాసింది. వాడివల్లే మళ్లీ ఊపిరిపీల్చుతున్నా నన్న ది. వాడు నాకు మరో జన్మని ప్రసాదించాడన్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gevin-saved-his-mother-39-142938.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.