చిలకలూరిపేటలో స్థల వివాదం...విడదల రజిని మామపై ఫిర్యాదు

Publish Date:Aug 20, 2025

Advertisement

 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన బూరుగపల్లి రామకృష్ణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ పట్టణ పరిధిలో 15వ బ్లాకులో 578.66 గజాల స్థలాన్ని 2012లో రిజిస్ట్రేషన్ నంబర్లు 8840/2012, 8657/2012 ద్వారా కొనుగోలు చేశాను. ఆస్తిలో భాగంగా 2014–2015లో బైరా శేషయ్య, మెట్టు శేషగిరిబాబు, గట్టా పూర్ణచంద్రరావుల వద్ద తనఖాగా పెట్టి అప్పు తీసుకున్నాను. అప్పు తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు అధిక వడ్డీ కోరారు. 

ఆ వివాదం కారణంగా మాజీ మంత్రి విడదల రజిని మామ విడదల లక్ష్మీనారాయణ, గ్రంధి ఆంజనేయులు, తోట బ్రహ్మస్వాములు ప్రభావంతో తోట వెంకటరత్నం నాయుడు పేరుమీద 2016లో బలవంతంగా జనరల్ పవర్ అఫ్ అటార్నీ వ్రాయించారు. దీనికి సంబంధించిన ఎటువంటి చెల్లింపు తనకు జరగలేదు. పైగా పూర్ణచంద్రరావుకు ఇవ్వాలని చెప్పి రూ. 8 లక్షలు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు తన ఆస్తి హక్కులు తిరిగి రాలేదు. వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కిడారి శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

కృష్ణా జిల్లా గూడూరు మండలం లేళ్లగరువు గ్రామానికి చెందిన పుప్పాల వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలో తమ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 722లో 34 సెంట్ల భూమి ఉంది. తమ బంధువులైన పుప్పాల నాగభూషణం, అతని కుమారుడు పుప్పాల హరికిరణ్ లకు తమ భూమిని కౌలుకు ఇచ్చాం. తమ తెలియకుండా వారు అధికారులతో కలిసి సర్వే చేయించుకోని భూమిని ఆన్‌లైన్‌లో ఇతరుల పేరుపై మార్చి మాస పద్మావతి పేరుతో విక్రయించారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావునా తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్ధించాడు. 

చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమందా గ్రామానికి చెందిన ఎం. ఈశ్వరయ్య గ్రీవెన్స్ లో  అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో సర్వే నంబర్ 457/8లో 1.19 సెంట్లు భూమి ఉండగా, రీసర్వేలో 0.99 సెంట్లుగా చూపించారు. రీసర్వేలో తగ్గిన భూమిని ఎం. నాగరాజు వైసీపీ బూత్ ఎజెంట్ గా పనిచేస్తూ గత ప్రభుత్వంలో భూమిని కబ్జా చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకుండా తమనే అడ్డుకుంటున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని  అభ్యర్ధించాడు. 
 
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం నెలటూరు గ్రామానికి ఈదర సావిత్రి గ్రీవెన్స్ లో  అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తాళ్ళూరి శ్రీనివాస్ అనే బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, అమ్మమ్మ అయినా తన సంరక్షణలో జీవిస్తున్నాడు. నెలటూరు గ్రామంలో తన మనవడికి సంబంధించి 110చ.గ. ఆస్తి ఉంది. తమ ఇల్లు ఎదురుగా భార్యభర్తలు అయినా తాళ్ళూరి రమేష్, తాళ్ళూరి సమంత ఉన్నారు. వీరు ప్రతి రోజు ఆస్తి అమ్మలాని వేధిస్తున్నారు. అమ్మకపోతే తమ మనవడిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ప్రాణ భయంతో ఆ ఇంటికి తాళం వేసి చాగల్లులో నివాసం ఉంటున్నాం. వారిపై చర్యలు తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం మంగుంట గ్రామానికి చెందిన ఎన్. జనార్ధన్ రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..మంగుంట గ్రామం నుండి దిగువ మంగుంట గ్రామానికి సుమారు రూ.70 లక్షలతో సిమెంట్ రోడ్డు, కల్వర్ట్, రివెట్‌మెంట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించగా, వైసీపీ జడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రహదారిని తమ భూముల వరకు మాత్రమే వేసుకుని, దిగువ మంగుంట గ్రామానికి చేరకముందే సుమారు 50 అడుగుల దూరంలో రోడ్డు నిలిపివేశారు. 

ఈ అంశంపై గ్రామస్థులు ఫిర్యాదు చేస్తే గ్రామానికి ఇప్పటికే మూడు రోడ్లు ఉన్నాయి. 4వ రోడ్డు అవసరం లేదన్నారు. జడ్పీ ఫండ్స్ ద్వారా రోడ్డు వేసి తన కోడలు సర్పంచ్ బి.రూప ద్వారా గ్రామసభ ఆమోదం పొంది. తన భార్య టీ. సరస్వతి ద్వారా కాంట్రాక్టర్లలకు బిల్లులు వచ్చిన తర్వాత రోడ్డును నిలిపివేశారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదు. కావునా దీనిపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించాడు.

By
en-us Political News

  
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.