ఇంటర్ పాసైన మావోయిస్టు మాజీ నేత దేవ్ జీ

Publish Date:Jun 12, 2026

Advertisement

పట్టుదల ఉంటే చదువుకు వయస్సు అడ్డం కాదని నిరూపించారు మావోయిస్టు మాజీ నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.  ఒకప్పుడు తుపాకీ పట్టి దండకారణ్యంలో  దళాలను నడిపించిన ఆయన..  ఇప్పుడు పుస్తకం పట్టి విజయాలు సాధిస్తున్నారు. ఆయుధం విడిచి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ  న్యాయవాది కావాలనే తన జీవిత ఆశయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే..  42 ఏళ్ల  విరామం తర్వాత   ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ..  నాలుగు దశాబ్దాల క్రితం మధ్యలో ఆగిపోయిన తన చదువును మళ్లీ కొనసాగించాలని గట్టి సంకల్పంతో  శ్రద్ధగా చదివి ఇంటర్ పరీక్షలు రాశారు.  ఈ పరీక్షల్లో ఆయన   349వ  ర్యాంకు సాధించారు.   ఐదేళ్ల లా కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ తప్పనిసరి. 

దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో..  దేవ్‌జీ ఇటీవల జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 42 ఏళ్ల క్రితం మిగిలిపోయిన ఆ ఒక్క తెలుగు పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన తెలుగు సబ్జెక్టులో 100 మార్కులకు గాను 72 మార్కులు సాధించి ఘన విజయం సాధించారు. దీనితో మొత్తం 614 మార్కులతో ఆయన ఇంటర్మీడియట్ విద్యను అధికారికంగా పూర్తి చేశారు. తుపాకీ పట్టిన చేత్తో కలం పట్టి, విద్య ద్వారా కొత్త జీవితాన్ని అద్భుతంగా ప్రారంభించిన దేవ్‌జీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోంది.

By
en-us Political News

  
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచలో శక్తివంతమైన దేశగా ఎదగాలనుకుంటున్న చైనాకు జనాభానే ప్రతిబంధంగా మారింది.
బెంగళూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల అరాచక, చీకటి పాలనకు తెరదించుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అఖండ విజయం
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారు కేవలం ఓట్లు వేయడమే కాకుండా, దేశ చరిత్రను తిరగరాయగల శక్తిమంతులని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ నాయక్ (39) ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది.
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదరైంది.
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడి ఘటన సంచలనం రేపింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను, భవిష్యత్ ప్రణాళికలను మీడియా వేదికగా ప్రకటించారు.
సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సిడ్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు.. సెమీస్ లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు.
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.