గచ్చిబౌలిలో లిఫ్టులో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి
Publish Date:May 13, 2026
Advertisement
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న మాహి ఉమెన్స్ పీజీ భవనంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారి గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లో చిక్కుకుపోయి మృతి చెందడం స్థానికులను షాక్కు గురిచేసింది. జార్ఖండ్కు చెందిన బిస్తు సేఫ్గా బాలిక తన తాత, అమ్మమ్మలతో కలిసి గచ్చిబౌలిలోని ఈ పీజీ హాస్టల్లో నివసిస్తున్నది. కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి లిఫ్ట్ దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆడుకుంటూ లిఫ్ట్లోకి వెళ్లిన చిన్నారి గ్రిల్ మధ్య ఇరుక్కుపోయి బయటకు రాలేకపోయింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన బాలికను గుర్తించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. తలుపులు తెరిచి బయటకు తీసేలోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగి పోయింది. చిన్నారి తాత, అమ్మమ్మలు తీవ్ర షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. లిఫ్ట్ నిర్వహణ, భవన భద్రతా ప్రమాణాలు, పీజీ నిర్వాహకుల నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులెవరు అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. గచ్చిబౌలిలో జరిగిన ఈ విషాదం చిన్నారుల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తిస్తోంది.
http://www.teluguone.com/news/content/fiveyearold-girl-dies-after-getting-stuck-in-lift-in-gachibowli-36-219681.html





