హుండీలో నకిలీ నోట్ల కలకలం

Publish Date:Mar 23, 2026

Advertisement

 

 

హైదరాబాద్‌ నగరంలోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య నకిలీ నోట్లు బయటపడటంతో ఆలయ వర్గాల్లో కలకలం రేగింది. పవిత్ర స్థలంలోనే ఈ తరహా మోసపూరిత చర్యలు వెలుగుచూడడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో సాధారణంగా నిర్వహించే హుండీ లెక్కింపు కార్యక్రమంలో సిబ్బంది నగదును వేరు చేస్తుండగా, కొన్ని అనుమా నాస్పద నోట్లు కనిపించాయి.

అవి మొదట నిజమైన కరెన్సీలా కనిపించినప్పటికీ, జాగ్రత్తగా పరిశీలించగా అవి “Childrens Bank” పేరుతో ఉన్న నకిలీ నోట్లు అని గుర్తించారు. 100, 200, 500 రూపాయల ముద్రణతో ఉన్న ఈ డూప్లి కేట్ నోట్లు అసలు నోట్లతో కలిపి హుండీలో వేసినట్లుగా పూజారులు గుర్తించారు. అది చూసిన ఆలయ సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. విషయం కాస్త బయటకు రావడంతో భక్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దేవుడికి సమర్పణగా ఇచ్చే హుండీలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని, భక్తి పేరుతో దుర్వినియోగం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలా నకిలీ నోట్లు వేయడం ద్వారా మోసం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక వర్గాలు కూడా ఈ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. పవిత్రతకు ప్రతీకగా భావించే దేవాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఏంటి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  “దేవుడి ముందు కూడా నిజాయితీ లేకపోతే, మరెక్కడ ఉంటుంది?” అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, భవిష్యత్తులో హుండీ లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే సీసీ కెమెరాల పర్యవేక్షణను పెంచడంతో పాటు, నకిలీ నోట్లు గుర్తించే విధానాలను కూడా అమలు చేస్తామని చెప్పారు. భక్తులు హుండీలో సమర్పించే నగదు విషయంలో జాగ్రత్త గా ఉండాలని, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి, భక్తి పేరుతో హుండీలో నకిలీ నోట్లు వేయడం ఆలయ పవిత్రతను దెబ్బతీసే చర్యగా భావించబడుతోంది. ఇప్పుడు తాజాగా ఈ ఘటన భక్తులలో చర్చనీయాంశంగా మారింది.

By
en-us Political News

  
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అలాగే.. విమానాశ్రయం సమీపంలోనే ఉన్న ఇరాన్ వైమానిక దళానికి చెందిన కీలక యుద్ధ విమాన స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపించింది.
హార్మూజ్ జలసంధి మీదుగా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలిగించవద్దని, ఒకవేళ దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే.. ఈ బెదిరింపులను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పైపెచ్చు ట్రంప్ పై సామాజిక మాధ్యమం వేదికగా మీమ్స్, సెటైర్లు గుప్పించింది.
ఈ ప్రాజెక్టు కోసం గూగుల్ 15 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1.25లక్షల కోట్లు భారీ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని మూడు వేర్వేరు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి, విశాఖ జిల్లాలోని అడవివరం, తర్లువాడ గ్రామాల్లో 600 ఎకరాల భూమి కేటాయించింది.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత రద్దైన నోట్ల పోగుపడ్డాయి. కాదు కాదు పేరుకుపోయాయి. కేంద్రం, అలాగే ఆర్బీఐ కూడా వీటి మార్పిడిని అనుమతించకపోవడంతో ఇవి నిరుపయోగంగా మిగిలిపోయాయి.
2025 రెండవ త్రైమాసికం నాటికి భారతదేశ ఐటీ లోడ్ సామర్థ్యం 1.4 గిగావాట్లుగా ఉంది, మరియు ఈ సంఖ్య రెండేళ్లలో రెట్టింపు అవుతుందని అంచనా. నగరంలోని ఫైబర్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు సమీపంలో ఉండటం, మరియు ఇప్పటికే స్థిరపడిన ఎంటర్‌ప్రైజ్ ఎకోసిస్టమ్‌ల కారణంగా, దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో తక్కువ లేటెన్సీ కవరేజీని కోరుకునే ఏ ఆపరేటర్‌కైనా ఇది ఒక సహజ కేంద్రంగా పనిచేస్తుంది.
రాజుపేటకు చెందిన యువతి, ఓ మరుగుజ్జు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అదే ప్రాంతానికి చెందిన వేముల శశి , ఓ ముస్లిం యువతి మధ్య 9వ తరగతిలో ప్రారంభమైన స్నేహం క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంగా మారింది.
రెండు రోజులలో పిడుగుపాటుకు రాష్ట్రంలో 9 మంది మరణించారు. సోమవారం (ఏప్రిల్ 6) ప్రకాశం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఒకరు పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడ్డారు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ బౌలర్ క్సావియర్ బార్ట్లెట్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కేకేఆర్‌ను కష్టాల్లో నెట్టాడు.
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.