Publish Date:Nov 19, 2019
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడు నెలలు దాటిపోయింది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై కూడా ఆర్నెళ్లు కావొస్తోంది. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు పెట్టిన ఖర్చులపై ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పిస్తున్నాయి. వచ్చిన విరాళాలు... ఎన్నికల్లో ఖర్చుపై... వైసీపీ... అలాగే టీడీపీ... వివరాలు వెల్లడించాయి. అయితే, ఎన్నికల సమయానికి కేవలం 74లక్షలు మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ కలిగివున్న వైసీపీకి... ఎన్నికలు ముగిసేనాటికి 221కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో 85కోట్లను ఎన్నికల కోసం ఖర్చు చేసింది వైసీపీ. 9.72కోట్లు స్టార్ క్యాంపెయినర్ల కోసం... 36కోట్లు మీడియా ప్రకటనల కోసం వ్యయం చేశారు. మీడియా ప్రకటనల కోసం ఖర్చు చేసిన 36కోట్లలో... వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ కే 24 కోట్లు ముట్టచెప్పారు. ఇక, వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ కి రికార్డు స్థాయిలో 37కోట్ల రూపాయలు చెల్లించింది. అలా, ఎన్నికల ఖర్చు తర్వాత వైసీపీ బ్యాంకు ఖాతాలో 138కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇక, వైసీపీకి వచ్చిన విరాళాల్లో 181కోట్లు విరాళాల ద్వారా, 99కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా, 36కోట్లు నాన్ కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చినట్లు యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ లో వైసీపీ ప్రకటించింది.
ఇక, ఘోర పరాజయం చవిచూసి, కేవలం 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం... ఎన్నికల కోసం 77కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అందులో మీడియా ప్రకటనల కోసం 49కోట్లు ఖర్చు చేయగా, హెలికాప్టర్ల వినియోగం కోసం 9కోట్లు వ్యవయం చేసింది. ఇక, ఎన్నికల నాటికి టీడీపీ అకౌంట్లో 102 కోట్లు ఉండగా, విరాళాల రూపంలో 131కోట్లు వచ్చాయి. ఎన్నికల వ్యయం తర్వాత టీడీపీ అకౌంట్లో ఇంకా 155కోట్లు ఉన్నట్లు ప్రకటించింది.
ఇక, తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... కేవలం 29కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ లో తెలిపింది. అలాగే, విరాళాల రూపంలో 188కోట్లు వచ్చినట్లు తెలిపింది. అయితే, ఏపీలో మాత్రమే వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ఎన్నికల కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశాయి. తెలుగుదేశం 77కోట్లు ఖర్చుచేస్తే... వైసీపీ మరింత ఎక్కువగా 85కోట్ల రూపాయలను వ్యయం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/expenditure-reports-of-political-parties-39-91337.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.