పదవుల పోట్లాట... అహమే అడ్డుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నేతలు!

Publish Date:Nov 19, 2019

Advertisement

 

మహబూబాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సీనియర్ లీడర్ రెడ్యా నాయక్. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నేత. ఇదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి సత్యవతి రాథోడ్. ఇద్దరి నేతలు ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఉన్నారు. ఒకే సామాజిక వర్గం ఒకే నియోజక వర్గం కావడంతో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఓ లెవల్ లో సాగుతుంది. ఎమ్మెల్యే కూతురు కవిత కూడా ఎంపీ. పైకి చూస్తే నియోజకవర్గంలో అంతా బాగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఇగో ఫీలింగ్ అసలు సమస్యగా మారింది. రాజకీయాల్లో తన జూనియర్ తన చేతిలో ఎమ్మెల్యేగా ఓడిన నేత మంత్రి గావడం ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదు. తనకు మంత్రి పదవి రాకపోవడం పట్ల సన్నిహితులు, పార్టీ సీనియర్ల దగ్గర తన ఆవేదన పంచుకున్నారు. కానీ తన జూనియర్ కు మంత్రి పదవి ఇవ్వడంపై మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇటీవల కార్తీక పౌర్ణమి రోజున జరిగిన సంఘటన ఇందుకు ఉదాహారణ.. డోర్నకల్ నియోజకవర్గంలో ఇలాంటి సీన్లు ఇప్పుడు కామన్ గా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే ఒకరికొకరు ఎదురుపడినా కనీసం పలకరించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఇటీవలే జిల్లాలో కురవి మండలం కందికొండలో జాతర జరిగింది. కందగిరి పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఆంగోతు బిందు కలిసి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చారు. ప్రియదర్శనం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఆయన కూతురు కవిత , మంత్రికి ఎదురుపడ్డారు కానీ మంత్రిని కనీసం పలుకరించకపోవడం విమర్శలకూ దారితీసింది. అలయంలో ఇలా జరిగితే బైట కూడా అదే సీన్ రిపీటైంది. మంత్రి మీడియా సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీ డుమ్మాకొట్టారు. అదే ప్లేస్ లో ఆ తర్వాత ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు మంత్రి పదవి దక్కక పోవడం, సత్యవతికి మంత్రి పదవి ఇవ్వడంతో రెడ్యా నాయక్ ముఖం చాటేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వర్గపోరుతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు.

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.