Publish Date:Nov 19, 2019
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. సుదీర్ఘకాలంగా బయటున్నవాళ్ల బెయిల్ రద్దుచేసి నాలుగు వారాల్లో జైలుకు పంపాలని సుప్రీం ఆదేశించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే, కేంద్ర హోంశాఖ పేరుతో మరో వార్త సర్క్యులేట్ అవుతోంది. సీరియస్ కేసుల్లో బయటున్న నిందితుల బెయిల్స్ రద్దు కోసం కోర్టుల్లో పిటిషన్ వేయాలంటూ సీబీఐ, ఈడీలను కేంద్ర హోంశాఖ ఆదేశించిందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇందులో జగన్ పేరు కూడా ఉందని, దాంతో మళ్లీ జైలుకెళ్లడం ఖాయమంటూ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు నో చెప్పడంతో... త్వరలోనే బెయిల్ కూడా రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ వేసే అవకాశముందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక, టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా కూడా ఇలాంటి పోస్టే ఒకటి పెట్టారు. జగన్ బెయిల్ రద్దుకు సీబీఐ పావులు కదుపుతోందని, విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిని కేంద్రం సున్నితంగా తిరస్కరించిందంటూ ట్వీట్ చేశారు.
జరుగుతున్న ప్రచారంలో నిజముందో లేదో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి... తన సతీమణితో కలిసి గవర్నర్ ను కలవడంపైనా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బెయిల్ రద్దయి... జగన్ జైలుకెళ్తే... భారతిని ముఖ్యమంత్రి చేస్తారని, అందుకే... ముందుగా గవర్నర్ కు పరిచయం చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, భారతిని పాలనా వ్యవహారాల్లో ఇన్ వాల్వ్ చేస్తున్నారని, శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇక, ఇటీవల కేసీఆర్ కూడా... మూడు నాలులు నెలల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే బెయిల్ రద్దయి జగన్ జైలుకెళ్తే... విజయమ్మ ముఖ్యమంత్రి అవుతుందే కానీ... భారతిని ఎంచుకోకపోవచ్చని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే, సీబీఐ ఒకవేళ బెయిల్ రద్దు చేయాలని కోరినా... కోర్టు అంత త్వరగా అంగీకరించే పరిస్థితి ఉండదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbi-seeks-to-cancel-bail-to-ys-jagan-39-91335.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.