40 ఏళ్ల రికార్డు బద్దలు! ఆసియా ఫుట్‌బాల్‌లో భారత్ సరికొత్త చరిత్ర!

Publish Date:Aug 21, 2026

Advertisement

ఆసియా ఫుట్‌బాల్ వేదికపై భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మలేసియాలోని కోటా కినాబాలు వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌‌ 2026–27 ప్రిలిమినరీ స్టేజ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ చారిత్రాత్మక సంచలనం సృష్టించింది. గువామ్‌కు చెందిన రోవర్స్‌‌ ఎఫ్‌‌సీతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ మహిళల జట్టు ఏకంగా 12–0 గోల్స్ తేడాతో ప్రత్యర్థిని ఘోరంగా చిత్తు చేసింది. మైదానంలో ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడిన భారత క్రీడాకారిణులు ప్రత్యర్థికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే ప్రియాంక దేవి అద్భుత గోల్‌తో ఖాతా తెరిచి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత 15వ నిమిషంలో ఆస్తమ్‌‌ ఒరాన్‌‌, మళ్లీ 22వ నిమిషంలో ప్రియాంక గోల్ కొట్టడంతో ప్రథమార్ధంలోనే మ్యాచ్ ఈస్ట్ బెంగాల్ చేతుల్లోకి వచ్చింది. ఇక ద్వితీయార్థంలో ఈస్ట్ బెంగాల్ ఆటగాళ్లు గోల్స్ వర్షం కురిపించారు. ఒలివియా అనోక్యే 48, 58వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో మెరవగా, అబిగైల్‌‌ అంట్వికి 49వ నిమిషంలో, సులంజన 51వ నిమిషంలో, షిల్కీ 56వ నిమిషంలో వరసగా గోల్స్ సాధించారు. మ్యాచ్ ముగిసే సమయానికి అబెనా ఒపోకు 64, 70వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టగా, అంజు 73వ నిమిషంలో, ఇంజారీ టైమ్‌లో గుగులోత్‌‌ సౌమ్య 93+3వ నిమిషంలో గోల్ సాధించి రికార్డు విజయాన్ని ఖరారు చేశారు.

 

 

 

east bengal fc historic 12 0 victory rovers fc,afc womens champions league east bengal record.
 

By
en-us Political News

  
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రపంచ దిగ్గజ సంస్థలైన సిస్కో, శామ్‌సంగ్, AWS లను వణికించిన భారీ సప్లై చైన్ సైబర్ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. LiteLLM టూల్ ద్వారా 2,500 కి పైగా కంపెనీల రహస్య క్లౌడ్ డేటా, కీలు ఎలా లీక్ అయ్యాయో చూడండి.
ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ ఇప్పుడు హౌస్ ఆఫ్ ఏసర్గా అవతరిస్తోంది. ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా అక్షయ్ కుమార్‌ను అంబాసిడర్‌గా పెట్టి గృహోపకరణాలు, లగేజ్, టీవీలు, స్మార్ట్ రింగ్స్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ గాజా క్యాపిటల్ ఐపీఓ చివరి రోజు నాటికి 2.52 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. జీఎమ్‌పి, లిస్టింగ్ గెయిన్స్, లాట్ సైజు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్ పూర్తి సమాచారం తెలుసుకోండి.
రంగారెడ్డి జిల్లా ఎమ్మార్వో దేశం శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 100 కోట్ల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కేజీకి పైగా బంగారం, స్థలాలు, భవనాలు మరియు బార్‌లో పెట్టుబడులకు సంబంధించిన విస్తుపోయే నిజాలు ఈ కథనంలో చదవండి.
భారతదేశంలో ఇంటర్నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తామని ఎలన్ మస్క్ హామీ ఇచ్చారు. 11 వేలకు పైగా గ్రామాల్లో 4G నెట్‌వర్క్ లేని పరిస్థితుల్లో, స్పేస్‌ఎక్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మరియు భారతీయ నిబంధనల సవాళ్లపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అప్లైడ్ ఏఐ స్టూడియో ఫౌండర్ బాల పన్నీర్ సెల్వం చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 17 కిలోమీటర్లకు 2 గంటల సమయం పడుతోందని, ఉద్యోగుల ప్రయాణ నరకంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.