రాత్రివేళ త్వరగా తింటే ఎంత లాభమో!

Publish Date:Jan 18, 2019

Advertisement

 

ప్రపంచం మారిపోయి ఉండవచ్చు. మనం జీవించే విధానమూ మారిపోయి ఉండవచ్చు. కానీ పెద్దలు చెప్పిన మంచి మాటలకి మాత్రం ఎప్పటికీ రోజులు చెల్లిపోవు. అందుకు ఉదాహరణగా రాత్రిపూట ఆహారం గురించి పెద్దలు చెప్పే మాటల గురించే చెప్పుకోవచ్చు. ‘రాత్రివేళ మనం తినే ఆహారం పడుకునే సమయానికల్లా అరిగిపోయేలా ఉండాల’న్నది పెద్దల మాట. అంటే కనీసం రాత్రి ఎనిమిదింటికల్లా తినేయాలన్నమాట. ఇదెంత ఆరోగ్యకరమో ఒక పరిశోధన రుజువుచేస్తోంది చూడండి!

 

పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు... ఆలస్యంగా ఆహారం తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి వారికి వేర్వేరు అలవాట్లను సూచించారు. మొదటి బృందంలో ఉన్నవాళ్లు ఉదయం ఎనిమిదిగంటల నుంచి రాత్రి ఏడుగంటల లోపు ఆహారం తీసుకోవాలని సూచించారు. రెండో బృందంలోని వారిని మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆహారం తీసుకోవచ్చని చెప్పారు. నిద్రపోయే సమయాలు మాత్రం, అభ్యర్థులందరికీ ఒకేలా ఉండేలా జాగ్రతత్తతీసుకున్నారు.

 

ఒక ఎనిమిదివారాలపాటు సాగిన ఈ పరిశోధనతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆహారం తినే సమయాన్ని బట్టి మన శరీరంలోని జీవక్రియలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించారు. ఆలస్యంగా తిన్నప్పుడు ఆహారంలోని కొవ్వు, శరీరానికి ఎక్కువగా అందుతున్నట్లు తేలింది. శరీరం పీల్చుకునే ఆక్సిజన్కంటే వదులుతున్న కార్బన్డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. శరీరంలోని ఈ ఆక్సిజన్, కార్బన్డైఆక్సైడ్ల మధ్య నిష్పత్తిని Respiratory quotient అంటారట. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, శరీరం హానికారక పదార్థాలనే ఎక్కువగా స్వీకరిస్తోందని అర్థం.

 

ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని భిన్నంగా స్వీకరిస్తోందని అర్థమైపోయింది. దీని వల్ల శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి, గుండె పనితీరు, కొవ్వు శాతం, గ్లూకోజు నిల్వలు... అన్నింటి మీదా ప్రతికూల ప్రభావం ఉన్నట్లు గమనించారు. అంతేకాదు! పగటివేళ ఆహారానికి అలవాటుపడితే, మనలో ఆకలిని కలిగించే ghrelin అనే హార్మోను కూడా పగటివేళే చురుగ్గా పనిచేస్తోందని తేలింది. అలాగే పొట్ట నిండుగా ఉండే భావనని కలిగించి, చిరుతిళ్లకు దూరంగా ఉంచే leptin అనే హార్మోను అదుపులో కనిపించింది.

 

ఒక్కమాటలో చెప్పాలంటే- రాత్రి ఆలస్యం కాకుండానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అధికబరువు వంటి సమస్యల నుంచి కూడా త్వరగా దూరం కావచ్చునని అంటున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంలో చాలా మార్పులు స్పష్టంగా వచ్చితీరతాయని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు.

- నిర్జర

 

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.