హైదరాబాద్లోని గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఓ లగ్జరీ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఓ యువకుడు ఫుల్గా మద్యం సేవించి మితిమీరిన వేగంతో కారు నడుపుతూ ఒక వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను కారు బానెట్పై ఈడ్చుకెళ్ళాడు. పోలీసుల కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుర్రంపాటి తరుణ్ అనే యువకుడు ఫుల్ గా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా ఆగకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుండటంతో.. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. అయినా తరుణ్ కారు ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కారు బాయినెట్ పై పడ్డారు.
అలా పడిన కానిస్టేబుల్ తో సహా కారును దాదాపు అరకిలోమీటర్ తీసుకెళ్లిపోయాడు. స్థానికులు అప్రమత్తమై తమ వాహనా లను అడ్డంగా పెట్టడంతో ఆ ర్యాస్ డ్రైవర్ తరుణ్ కారును ఆపకతప్పలేదు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయాలతో బయటపడ్డారు. సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేసి తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించ గా, అతను భారీగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. అతడిని కోర్టులో హాజరుపరచగా కోర్టు గుర్రంపాటి తరుణ్కు 14 రోజుల రిమాండ్ విధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drunk-and-drive-youth-drag-conistable-on-boynet-36-214854.html
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.