కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆయుధాల బెదిరింపుల ఘటన, నేతల మధ్య తీవ్ర విమర్శలు, అనంతరం పార్టీ శ్రేణుల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్లోని అల్గునూరు చౌరస్తాలో ఖాలీద్ అనే హైకోర్టు న్యాయవాదిని కొందరు దుండగులు తుపాకులతో బెదిరించిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయంపై న్యాయవాది కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లభించలేదని ఆరోపించారు. దీనితో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో రాష్ట్రంలో గన్ కల్చర్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డ్రగ్స్ పరీక్షలకు కల్వకుంట్ల తారక రామారావు సిద్ధంగా ఉన్నారని, అలాగే రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్నవాహ నాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఈ దాడి జరిగిన కార్యాలయం గంగుల కమలాకర్ కు చెందిన క్యాంప్ ఆఫీస్గా తెలుస్తోంది. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకే నిరసనగా ఈ దాడి జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలతో జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-workers-attack-karimnagar-mlas-office-36-219148.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.