పిల్లల ముందు ఏడుస్తుంటారా? ఈ నిజం తెలిస్తే..!

Publish Date:Sep 29, 2025

Advertisement


కాలాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా తల్లిదండ్రులు కష్టమైనా, బాధ అయినా పిల్లలకు తెలియకుండా దాస్తుంటారు.  అయితే కొన్నిసార్లు పిల్లల నుండి వాటిని దాచడం కష్టం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు భావోద్వేగానికి గురవుతారు. తల్లిదండ్రుల కన్నీళ్లు పిల్లల హృదయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.  చాలా మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల బాధను చూసి, విచారంగా,  నిశ్శబ్దంగా మారతారు. అయితే ఇలా పిల్లల ముందు బాధపడటం,  ఏడ్వడం పిల్లల మీద ప్రభావం చూపుతుందా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

ఎమోషన్ సెన్సిటివిటీ..

పిల్లల ముందు ఏడుపు అనేది ఒక సహజ భావోద్వేగం, ఇది పిల్లలు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి,  అంగీకరించడానికి సహాయపడుతుంది. పిల్లల ముందు ఏడ్వడం లేదా బాధపడటం అనేది  పిల్లలు విచారం, ఆందోళన లేదా ఒత్తిడిని దాచాల్సిన అవసరం లేదని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  వారు భావోద్వేగపరంగా తెలివైన వాళ్లుగా మారతారట. వాళ్లు కూడా తమ ఎమోషన్స్ ఎక్ప్రెస్ చేయడం నేర్చుకుంటారట.  ఇది సాధారణ జీవితానికి చాలా అవసరం. తల్లిదండ్రుల ఏడుపు పిల్లల భావోద్వేగ సెన్సిటివిటీ ని ,  సానుభూతిని పెంచుతుంది. బలమైన, సున్నితమైన వ్యక్తిత్వాలను అభివృద్ది చేయడంలో ఇది సహాయపడుతుందట.

ప్రతికూల ప్రబావం..

పిల్లల ముందు ఏడవడం వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ కంటే  నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందట. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు నిరంతరం తమ భావోద్వేగ ఆందోళనలను వ్యక్తం చేస్తే, అది వారిలో అభద్రత, ఆందోళన, భయం వంటి భావాలను క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా తమ భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోలేని చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకోలేరు. ఇది వారి భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది.  

పిల్లలు ఏడ్వడం చూస్తే..

పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు  చూస్తే  తరచుగా  తమ ఎమోషన్స్ ను  దాచడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు. కానీ తల్లిదండ్రులు ఏడవడాన్ని పిల్లలు చూసినప్పుడు దానికి ల కారణాలను పిల్లలకు చెప్పాలి. ఇది పిల్లల భావోద్వేగ అవగాహనను పెంచుతుంది.

అబద్దాలు వద్దు..

తల్లిదండ్రులు ఏడుస్తున్నప్పుడు పిల్లలు గమనించే ఏమైంది అని అడిగితే.. ఏం లేదు అని సింపుల్ గా దాటవేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ ఇది సరికాదు. సరైన కారణం చెప్పకపోతే పిల్లలు కూడా తేలిగ్గా కాంప్రమైజ్ కారు. తల్లిదండ్రులు పిల్లల దగ్గర నిజాయితీగా ఉంటే.. పిల్లలు కూడా తల్లిదండ్రుల నుండి అలా నిజాయితీగా ఉండటమే నేర్చుకుంటారు.

సమస్యలు, పరిష్కారాలు..

సమస్య రావడం, ఇబ్బంది పెట్టడం,  పెద్దలు బాధపడటం ఇదంతా జరిగినట్టే పరిష్కారం కూడా ఖచ్చితంగా వస్తుంది. దీన్ని పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి గ్రహించగలిగితే.. సమస్యలు వచ్చినప్పుడు పిల్లలు ఎలాగైతే బాధపడతారో.. ఆ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయనే ధైర్యం కూడా వారిలో ఏర్పడుతుంది. ఇది పిల్లల జీవితంలో మంచి జీవితానికి పునాది అవుతుంది.

                              *రూపశ్రీ.

By
en-us Political News

  
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం.  ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు....
ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి.  ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక  ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు.  మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం...
అతి సర్వత్రా వర్జయేత్  అని అన్నారు పెద్దలు.  అంటే అతిగా ఏం చేసినా అది నష్టాన్నే కలిగిస్తుంది అని. అతిగా తినడం, తాగడం, ఏదైనా పని చేయడం,  నిద్రపోవడం.. ఇలా ఒకటని కాదు.. అతిగా ఏం చేసినా దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది...
ప్రపంచంలో ప్రతి మనిషి తన తన పాత్రలతో, బాధ్యతలతో జీవనం కొనసాగిస్తాడు. అందులో పురుషుల పాత్ర ప్రత్యేకం. కుటుంబం, సమాజం, వృత్తి ఈ మూడు రంగాలలోనూ పురుషులు  నిశ్శబ్దంగా, కనిపించని ఒత్తిడులను భరిస్తూ సాగుతుంటారు...
ఈ ప్రపంచంలో చాలా పవిత్రతను,  ప్రత్యేకతను కలిగి ఉండేది వైవాహిక బంధం.  ఇద్దరు వేర్వేరు వ్యక్తులు వివాహంతో ఒక్కటై.. జీవితాంతం కలిసి ఉండటం ఈ బంధానికి చాలా ప్రాధాన్యతను తెచ్చి పెడుతుంది.  సహజంగా పెళ్లి అంటే చాలా హడావిడి జరుగుతుంది....
మానవ సంబంధాలు చాలా గమ్మత్తైనవి.  కొన్నిసార్లు ఇవి ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలనే చేసుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.