Publish Date:Aug 12, 2022
ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం టీవీ సీరియల్ లా సా...గుతోంది. రోజుకో కుదుపు.. పూటకో మలుపులా ఈ కేసు విచారణ తీరు మారింది. సీబీఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించారు.
తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగాలని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ఆమె ప్రతివాదులుగా చేర్చారు. అత్యంత దారుణంగా, అమానవీయంగా జరిగిన తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.
2019 మార్చి 15న వివేకానందరెడ్డిని పులివెందులలోని తన నివాసంలోనే దారుణం హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఈ ఐదుగురి పేర్లు తెర మీదకు వచ్చినా.. వీరి వెనక సూత్రధారులు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగి మూడేన్నరేళ్లు పూర్తయినా ఇంకా దోషులెవరనేది తేలనే లేదు.
అయితే.. తన తండ్రి హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పట్టు వీడకుండా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే నిందితులు ఉల్టా కేసులు వేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ పై బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలతో విచారణ నత్తనడక నడుస్తోంది. దీంతో సునీతారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/doctor-sunita-file-pitition-in-supreme-on-probe-of-her-fathers-murder-case-25-141807.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.