Publish Date:Aug 12, 2022
చిన్నారులకు అవసరమయ్యే అన్ని ప్రాడెక్ట్స ను ఉత్పత్తి చేసి విక్రయించే సంస్థ ఏది అంటే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది జాన్సన్ అండ్ జాన్సన్. సబ్బు నుంచి చిన్నారుల కోసం ఉపయోగించే టవల్స్, ఆయిల్, మాయిశ్చరైజర్స్, డైపర్స్ ఇలా పువ్వుల్లాంటి తమ చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం ఉప యోగించే ప్రతి వస్తువూ జన్సన్ అండ్ జాన్సనే బ్రాండ్ ను ఉపయోగించేవారు కోకొల్లలు.
అలాంటిది ఇప్పుడు జన్సన్ అండ్ జాన్సన్ ఒక పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే బేబీ టాల్క్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్క్ అమ్మకాలు నిలిచిపోనున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో ఉపయోగించే ఆస్ బెస్టాస్ ఒవేరియన్లో క్యాన్సర్ కారకాలున్నాయని వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ లో క్యాన్సర్ కారకాలున్నాయంటూ దాదాపు 38వేల కేసులు నమోదయ్యాయి. అయితే క్యాన్సర్ కారకాల ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ ఖండించింది. తాము ఉత్పత్తి చేసే బేబీ టాల్కం పౌడర్ సురక్షితమైనదేనని వైద్య నిపుణులు నిర్ధారించారనీ చెబుతోంది. అయినా వినియోగదారుల ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
దీంతో వచ్చే ఏడాది తరువాత ఈ సంస్థ విక్రయిస్తున్న బేబీ టాల్కమ్ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ బేబీ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ ని వినియోగించాలని నిర్ణయించింది. అదలా ఉంచితే రెండేళ్ల కిందటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను అమెరికా, కెనడాలలో నిలిపివేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cancer-threat-with-johnson-and-jhonson-baby-talcum-sales-to-be-stopped-25-141804.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.