ఎన్డీయే, ఇండియా కూటములు ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వర్క్ షాపులు, అవగాహన సదస్సులు నిర్వహించాయి. వీటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. మొదటి ప్రాధాన్యతా ఓటు తప్పనిసరి, రెండో ప్రాధాన్యతా ఓటు ఐచ్ఛికం. ఆ తర్వాత ఈ ఓటింగ్ విధానంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన పెన్ను ఇస్తారు. దీని ద్వారా మాత్రమే బ్యాలెట్ పేపర్ పై గుర్తులు పెట్టాలి. ఇక బ్యాలెట్ పేపర్ లో మొదటి పేరు కూటమి అభ్యర్ధి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిది ఉండగా.. రెండో పేరు ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ పేరు ఉంటుంది.
అందుకే బీజేపీ తన ఎంపీలతో పాటు ఎన్డీయే కూటమి ఎంపీలను కలిపి జేపీ నడ్డా అధ్వర్యంలో వేర్వేరు వర్క్ షాపులు నిర్వహించింది. ఆ తర్వాత ఇండియా కూటమి సైతం మాక్ పోల్ నిర్వహించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఇండియా కూటమి పార్టీల ఎంపీలకు ఈ విషయంపై ఒక అవగాహన కల్పించాలన్నదే ఈ మాక్ పోల్ ముఖ్య ఉద్దేశం.
ఇక మంగళవారం (సెప్టెంబర్ 9) పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితం కూడా వెలువడుతుంది. ఉభయ సభల్లో ఇప్పటి వరకూ ఉన్న బలాబలాలు చూస్తే ఎన్డీఏకి 422 సీట్ల బలం ఉంది. ఇక ఇండియా కూటమికి 323 సీట్ల సపోర్ట్ ఉంది. ఆప్ కూడా తన 11 సీట్లను ఇండియా కూటమి అభ్యర్ధికే ఇస్తోంది. దీంతో ఈ బలం 334గా మారింది. చివర్లో కొన్ని తటస్త పార్టీల ఎంపీలు ఇటు వైపు మొగ్గితే ఈ సంఖ్య కొంత పెరిగినా పెరగొచ్చు. అలాగని ఎన్డీఏ అభ్యర్ధిని క్రాస్ చేయగలిగేంత కాదు. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్ధి గెలుపు దాదాపు లాంఛనం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే విజయానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 392 కన్నా ఎన్డీయే కూటమి సభ్యుల సంఖ్య ఎక్కువే ఉంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద బండినడకే అంటున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి తెలుగు పార్టీలన్నీ కలసి ఓట్లు వేయాలని కోరింది. ఈ ఎన్నికలో ఫలానా అభ్యర్ధికే ఓటు వేయాలని ఎవరూ విప్ జారీ చేయరు కాబట్టి.. ఈ దిశగా స్థానిక బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది మరి చూడాలి.. ఏదైనా మేజిక్ జరుగుతుందో లేదో?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/do-you-know-the-key-issue-in-vice-president-election-25-205781.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.