హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో మద్యం మత్తులో వాహనం నడిపి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో దర్శకుడు మణిశంకర్ కుమారుడు ప్రేమ్ శంకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రేమ్ శంకర్ తన ఎలక్ట్రిక్ కారులో రోడ్ నెం.3 వద్ద పంజాగుట్ట వైపు నుంచి శ్రీనగర్ కాలనీ దిశగా వెళ్తుండగా వాహనం బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. సాయంత్రం రద్దీ సమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది.అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు వాహ నాన్ని పక్కకు జరిపేందుకు సహకరించాలని కోరగా, మద్యం మత్తులో ఉన్న ప్రేమ్ శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహ రించాడు. దీంతో హోం గార్డు మన్యం వెంటనే సినీ దర్శకుడు కుమారుడికి బ్రీత్ ఎనలైజర్ చేసేందుకు ప్రయత్నించారు.
కానీ బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు కూడా ఆయన సహకరించలేదని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా దర్శకుడి కుమారుడు ప్రేమ్ శంకర్ ఒక్కసారిగా హోంగార్డ్ మన్యంపై విరుచుకుప డ్డాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం టోయింగ్ వాహనంతో కారును తొలగించే ప్రయత్నంలో ప్రేమ్ శంకర్ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిం చగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో అధిక మోతాదులో మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది.ఈ ఘటనపై బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్మోహన్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలో మద్యం మత్తులో వాహనదారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/directors-son-arrested-36-214985.html
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.