పిల్లలకు డిజిటల్ భద్రతకు సంబంధించి కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను నిషేధించనున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించారు. పిల్లలు ,టీనేజర్లపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కాగా దేశంలో ఈ దిశగా చొరవ తీసుకుని పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసిన తొలి రాష్ట్రంగా కర్నాటక నిలిచింది.
కర్ణాటక ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం ప్రకటించింది కానీ పటిష్టంగా అమలు చేసే విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ బర్త్ సర్టిఫికేట్లు, నకిలీ అక్కౌంట్ల బెడద ఎక్కువ అవుతందని పరిశీలకులు అంటున్నారు. పూర్తి నిషేధం కంటే తల్లిదండ్రుల అనుమతి ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ మేలని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందు కోసం ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు దేశాలలో ఇప్పిటికే పిల్లలకు సోషల్ మీడాయా యాక్సెస్ ను నిషేధించిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/digital-security-36-215115.html
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.