పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి కీలక సందేశం

Publish Date:Oct 13, 2025

Advertisement

 

రాష్ట్ర పోలీస్  సిబ్బందికి తెలంగాణ డీజీపీ  శివధర్ రెడ్డి  లేఖ రాశారు. ప్రజల భద్రత, పోలీస్ వ్యవస్థ నైతికత, సిబ్బంది సంక్షేమం గురించి స్పష్టమైన దిశానిర్దేశాలు అందించారు. డీజీపీ తన లేఖలో పేర్కొంటూ ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ నా ఫిలాసఫీ  అని అన్నారు. ప్రజల భద్రత మన ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం తన వ్యక్తిగత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. 


మనం చేపట్టే ప్రతి దర్యాప్తు ప్రజా సంక్షేమ పట్ల మన సునితత్వం మరియు నిబద్ధ తను ప్రతిబింబిం చాలి. మన లక్ష్యం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు. ప్రజలు గౌరవించే విధంగా చేసుకోవాలి. ప్రజా విశ్వాసమే పోలీసింగ్ యొక్క నిజమైన కొల మానం... ప్రజలతో సౌఖ్యంగా వ్యవహ రిస్తూ విధి నిర్వ హణ చేయాలి. ప్రతి పోలీస్ అధి కారి మరియు వారి కుటుంబం యొక్క సంక్షేమం వ్యక్తి గత ప్రాధాన్యత‌.. క్రమశిక్షణ సమగ్రత మరియు జవాబు దారితనం మన బలానికి మూల స్తంభాలుగా ఉంటాయి. నేరా లను నిరోధిం చడం... వివాదా లను పరిష్క రించడం.... భాగ స్వామ్య బాధ్యత యొక్క భావాన్ని తెలుసు కోవడం.... మనకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు...


అలాగే, పోలీస్ స్టేషన్లలో సివిల్ వివాదాలకు తావు ఇవ్వరాదని, అటు వంటి వ్యవహారాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోని వని డీజీపీ పేర్కొన్నారు. “పోలీస్ స్టేషన్‌లను సివిల్ పంచాయితీ అడ్డాగా మార్చితే కఠిన చర్యలు తీసుకుంటామని" హెచ్చరించారు. సమాజంలో శాంతిని కాపాడు కోవడంలో ప్రజల సహకారం తీసు కుంటూ ముందుకు వెళ్లాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. యూనిఫార్మ్ ధరించే వారిలో అవినీతి చోటు చేసుకోవడం అసహ్యకరమని చెప్పారు. “యూనిఫార్మ్, కరప్షన్ ఒకే చోట ఉండవు. ఒక్కరైనా లంచం తీసుకుంటే మొత్తం పోలీస్ శాఖ కే చెడ్డపేరు వస్తుంది. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని" స్పష్టం చేశారు. 

మన ప్రవర్తన యూనిఫామ్ కు గౌరవాన్ని మరియు ప్రభుత్వానికి గర్వాన్ని అలాగే సమాజానికి శాంతిని తెస్తుంది. ప్రతి అధికారికి నాదొక సందేశం... మీ యూనిఫామ్ ను గర్వంగా మరియు వినయంగా ధరించండి..ధైర్యంగా, మర్యాదగా కరుణతో విధి నిర్వ హణలో ప్రొఫెషనల్ గా ఉండండి. అలాగే పోలీసింగ్‌లో టెక్నాలజీ వినియో గాన్ని పెంచాలని సూచిస్తూ, “బేసిక్ పోలీసింగ్‌తో పాటు ఆధునిక సాంకేతిక తను ఉపయోగిం చాలని డీజీపీ పేర్కొన్నారు.

చివరిగా, ప్రజా సేవను ముఖ్యంగా గుర్తుచేస్తూ —మీరు నమోదు చేసే ప్రతి ఎఫ్ ఐ ఆర్.... మీరు స్పందించే ప్రతి కాల్... మీరు దర్యాప్తు చేసే ప్రతి కేసు... ఎంతో న్యాయబద్ధంగా, అత్యంత ప్రమాణా లను ప్రతిబింబించే విధంగా కేసును చేదించండి...మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మాలి. మనల్ని గౌరవిం చాలి.  “పేదవారు కష్టంలో ఉన్నప్పుడు పోలీస్ ఉన్నాడని గుర్తు చేయండి. ఆపదలో ఆదుకున్న వారిని ప్రజలు ఎప్ప టికీ మరిచిపోరు” అని సిబ్బందిని ఉద్బోధించారు. ఈ లేఖతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ప్రజాభిముఖత, నైతికత, సేవా ధోరణి పై స్పష్టమైన దిశానిర్దేశం లభించింది.

By
en-us Political News

  
ఎన్టీఆర్ ప్రాంతీయ నేత కాదు..యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ..
సాఫ్ట్‌వేర్ రంగంలో ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ, మట్టి వాసనపై ఉన్న మక్కువతో ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేశాడు.
భారతదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక సంచలన వివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నవ్యాంధ్రకు రెండు పెద్ద దెబ్బలు తగిలాయని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపోతున్న ఎండలు, వడగాల్పులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.
హైదరాబాద్ నగరంలో 14 సంవత్సరాలుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్న సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు మహానాడు వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటే, మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్టీఆర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే, ఐటీ నిరుద్యోగులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అమీర్‌పేట్ మైత్రీవనం జంక్షన్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎంతగానో అభివృద్ధి చెందుతోంది.
ప్రపంచానికే తలమానికంగా నిలిచేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పక్కన ఒక ట్రాన్స్‌జెండర్ కూర్చుని ముచ్చటిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. పార్టీ క్యాడర్ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.