ప్రేమంటే ఇదే.. అంటున్న మధ్యప్రదేశ్ జంట
ప్రస్తుతం వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్..
ప్రేమకు అసలు సిసలు నిర్వచనం చెప్పారు జంట. మనసులు కలిస్తే హోదాలు, మతాలు ఏవీ అడ్డుకావని మధ్యప్రదేశ్లో ఓ జంట నిరూపించింది. ఖైదీలను పర్యవేక్షించాల్సిన జైలు అధికారిణి.. తన వద్దే శిక్ష అనుభవించి విడుదలైన ఒక మాజీ ఖైదీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని సత్నా కేంద్ర కారాగారంలో ఫిరోజా ఖాతూన్ అనే మహిళ.. సహాయ డిప్యూటీ జైలర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2007లో జరిగిన హత్య కేసులో ధర్మేంద్ర అనే వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు విధించింది. సత్నా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఫిరోజా ఖాతూన్తో ధర్మేంద్రకు పరిచయం ఏర్పడింది. శిక్షా కాలంలో ధర్మేంద్ర ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆమెను ఎంతో ఆకర్శించింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.మతాలు వేరు కావడంతో ఈ పెళ్లికి ఫిరోజా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. సమాజం గురించి పట్టించుకోకుండా ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
వీరి వివాహ వేడుక ఇటీవల ఛతర్పూర్ జిల్లాలోని లవ్కుష్ నగర్లో అత్యంత వైభవంగా జరిగింది. ముస్లిం మతానికి చెందిన ఫిరోజా ఖాతూన్.. హిందూ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ధర్మేంద్రను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడారు. బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం.. మతసామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. వీహెచ్పీ నేతలు దగ్గరుండి వీరి పెళ్లి చేశారు. ఒకప్పుడు నిందితుడిగా జైలులో గడిపిన వ్యక్తి.. ఇప్పుడు ఒక అధికారిణికి భర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deputy-jailer-marries-former-prisoner-36-219195.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.