కాలికనడకన తిరుమల కొండకు 116 ఏళ్ల బామ్మ.. టీటీడీ రియాక్షన్.. వెరీ గుడ్.!

Publish Date:Jul 6, 2026

Advertisement

కలియుగ  ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పవిత్ర క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సాధారణంగా భక్తులు తిరుమలేశుని దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం తక్కువగా ఉంటుంది. క్యూలైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శనం భక్తులకు ఒకింత సులభంగా స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ వీఐపీ బ్రేక్ దర్శనం మూమూలు భక్తులకు లభించే అవకాశం ఇసుమంతైనా లేదు. కానీ ఓ సామాన్య భక్తురాలికి టీటీడీ ఆ సౌకర్యం కల్పించింది. ఆమెను వెతికి పట్టుకుని మరీ వీఐపీ బ్రేక్ దర్శనం చేయించింది. 

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.   116 ఏళ్ల వయసున్న ఒక వృద్ధురాలు శ్రీవారి దర్శనం కోసం కొండపైకి కాలినడకన వచ్చారు. ఆ వయోవృద్ధురాలు మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  సాధారణంగా యువకులే తిరుమల కొండ మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడుతుంటారు. అలసిపోయి పదేసి మెట్లకు ఒక సారి ఆయాసంతో విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక ప్రారంభిస్తుంటారు. అటువంటిది..  116 ఏళ్ల వయస్సులో, శారీరక ఇబ్బందులను అధిగమించి, కేవలం భగవంతుడిపై ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆమె తిరుమల కొండ మెట్లను ఎక్కి స్వామివారి దర్శనం కోసం రావడం నెటిజనులనే కాదు, సామాన్యులనుసైతం విశేషంగా ఆకట్టుకుంది. 

తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు.  శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.  

వెంటనే స్పందించిన ఆయన ఆ వృద్ధురాలి వివరాలను తెలుసుకుని.. మెట్టు మెట్టూ ఎక్కి తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు  ప్రత్యేకంగా విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు.  116 ఏళ్ల వయసులో కాలినడకన వచ్చిన నవనీతమ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత గౌరవప్రదంగా స్వామివారిని దర్శించుకు ఏర్పాట్లు చేశారు. టీటీడీ చర్యపట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

Tirumala updates, TTD VIP Break Darshan, 116 year old lady Tirumala, Navaneetamma Tirupati

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.