ట్రంప్, నెతాన్యాహూలను ఖతం చేయాలంటూ నినాదాలు.. ఎక్కడో తెలుసా?

Publish Date:Jul 5, 2026

Advertisement

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులను ఖతం చేయాలంటూ లక్షలమంది వీధుల్లో బహిరంగంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ జరిగింది.  ఆయన అంత్యక్రియల సందర్భంగా లక్షల మంది జనం వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున అమెరికా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది.  అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో  ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఉద్రిక్తతల కారణంగా వారి అంత్యక్రియలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తరువాత..  ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఒక వారం రోజుల పాటు ఖమేనీ అంత్యక్రియల శవయాత్రను అత్యంత భారీ ఎత్తున నిర్వహించింది. టెహ్రాన్‌లోని  గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో  లక్షలాది  ప్రజలు పాల్గొన్నారు. 

ఈ అంత్యక్రియల సభ  భారీ రాజకీయ ప్రదర్శనగా, ప్రతికార వేదికగా కనిపించింది.  ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ఇస్లామిక్ సంప్రదాయంలో  ప్రతికారానికి ప్రతీకగా భావించే ఎర్రజెండాలను పట్టుకుని లక్షలాది మంది జనం   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ నినాదాలు చేశారు.  అంత్యక్రియల వేదికపై ప్రముఖ కవి మహ్మద్ రసూలీ మాట్లాడుతూ, ఇకపై కఫనమే మా వస్త్రమని, ట్రంప్‌ను మట్టుబెట్టడం తమ పవిత్ర బాధ్యత అని పిలుపుచ్చారు.   సాధారణ పౌరులు సైతం తమ ఇమామ్‌ను చంపిన ట్రంప్‌పై పగ తీర్చుకుంటామని బాహాటంగానే  చెబుతున్నారు. 

ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన ప్రాణాపాయ బెదిరింపులు ఉన్నప్పటికీ, భద్రతా ఆంక్షలను పక్కనబెట్టి ఇరాన్ అగ్రనేతలు, మిలిటరీ కమాండర్లు సుదీర్ఘ కాలం తర్వాత ఉమ్మడిగా బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, శక్తివంతమైన కుద్స్ ఫోర్స్ అధిపతి ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్స్ హెడ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   కాగా ఖమేనీ శవపేటికతో పాటు ఆ దాడిలో మరణించిన ఆయన కోడలు జహ్రా హద్దాద్ అడెల్, కేవలం 14 నెలల వయసున్న ఆయన మనవరాలు జహ్రా మొహమ్మది గొల్పాయిగాని శవపేటికలను  చూసి జనం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్‌లోని ప్రముఖ నగరాల్లో ఊరేగించిన అనంతరం,  గురువారం   ఆయన స్వస్థలమైన మషాద్‌లోని పవిత్ర ఇమామ్ రెజా బలిపీఠం వద్ద ఖననం చేయనున్నారు.  

Teluguone, Ali Khamenei funeral, Iran revenge, Donald Trump, Benjamin Netanyahu, Tehran protests

By
en-us Political News

  
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.