తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య మల్లు వివాహ వేడుక శంషాబాద్ జీఎంఆర్ ఎరీనాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వివాహ వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ కేంద్రమంత్రి పీ.చిదంబరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతిపక్షానికి చెందిన నాయకుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పాడి పెడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ కూడా ఈ వివాహ వేడుకకు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.
అలాగే సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, నటుడు అక్కినేని నాగార్జున, హీరో శ్రీకాంత్ ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, హీరో గోపీచంద్ తదితరులు హాజరై వేడుకలో సందడి చేశారు. రాష్ట్రం నలుమూ లల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో పెళ్లి వేదిక కిటకిటలాడింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన హోదాను పక్కనపెట్టి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిథులతో కలిసి ఫోటోలు దిగుతూ, వారి కుశల ప్రశ్నలు అడుగుతూ అందరితో మమేకమయ్యారు. ఇంకా పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో జీఎంఆర్ ఎరీనా పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ వివాహ వేడుక తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల సమాగమంగా నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deputy-cm-bhattis-sons-wedding-in-grand-style-36-215072.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.